బాలీవుడ్‌ని సౌత్ సినిమాలు ఏలుతున్నాయా.. అజయ్ దేవ్‌గణ్ రియాక్షన్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-02-16T16:31:35+05:30 IST

బాలీవుడ్‌లోని పాపులర్ స్టార్ హీరోల్లో అజయ్ దేవ్‌గణ్ ఒకరు. ఏడాదికి రెండు, మూడు సినిమాలతో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు...

బాలీవుడ్‌ని సౌత్ సినిమాలు ఏలుతున్నాయా.. అజయ్ దేవ్‌గణ్ రియాక్షన్ ఏంటంటే..

బాలీవుడ్‌లోని పాపులర్ స్టార్ హీరోల్లో అజయ్ దేవ్‌గణ్ ఒకరు. ఏడాదికి రెండు, మూడు సినిమాలతో అభిమానులను పలకరిస్తూ ఉంటాడు. తాజాగా ఈ నటుడు ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’తో ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌ త్వరలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హట్‌స్టార్‌లో విడుదల కానుంది. దీంతో ప్రొడక్షన్ హౌస్ ఈ సిరీస్ ప్రమోషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది.


ముంబైలో జరిగిన ఆ కార్యక్రమంలో అజయ్ దేవ్‌గణ్‌కి టాలీవుడ్ సినిమాల విజయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అజయ్‌ని.. ‘బాలీవుడ్ మార్కెట్‌ని సౌత్ సినిమాలు ఆక్రమిస్తున్నాయి కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి’ అని ఓ రిపోర్టర్ అడిగాడు. దానికి సమాధానంగా.. ‘అదంతా ఉత్తదే. నిజానికి కరోనా కారణంగా 3, 4 నెలల తర్వాత థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. కాబట్టి హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ పరిశ్రమల నుంచి ఏ మంచి మూవీ విడుదలై ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాగే విడుదలైనా సూర్యవంశీ మూవీ రికార్డు కలెక్షన్స్ సాధించిందని తెలిసిందే కదా. పెద్ద సినిమాలు విడుదలైన తర్వాత ఏ మూవీస్ ఏలాతాయో తెలుస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-02-16T16:31:35+05:30 IST