Ram Setu: అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ కు వ్యతిరేకంగా పిటిషన్
ABN , First Publish Date - 2022-07-29T20:45:28+05:30 IST
బాలీవుడ్లో ప్రతి ఏడాది అత్యధిక సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). సంవత్సారానికి మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తుంటాడు. చివరగా అతడి నుంచి వచ్చిన చిత్రం ‘సామ్రాట్
బాలీవుడ్లో ప్రతి ఏడాది అత్యధిక సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). సంవత్సారానికి మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తుంటాడు. చివరగా అతడి నుంచి వచ్చిన చిత్రం ‘సామ్రాట్ పృథ్వీరాజ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. అయినప్పటికీ అక్కీ తన జోష్ను తగ్గించడం లేదు. వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. అతడి చేతిలో ‘సెల్ఫీ’, ‘రామ్ సేతు’ (Ram Setu), ‘బడే మియా, చోటే మియా’ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం అక్కీ నటించిన ‘రామ్ సేతు’ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామ్ సేతును ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బీజేపీ లీడర్, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి(Subramanian Swamy) నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ మేకర్స్కు వ్యతిరేకంగా పిటిషన్ వేశాడు. ఈ చిత్రంలో రామ్ సేతును తప్పుగా చూపించే అవకాశం ఉందని అతడు పేర్కొన్నాడు. నిజాలను తారుమారు చేసే అవకాశం ఉందని వెల్లడించాడు.
కేంద్ర ప్రభుత్వం రామ్ సేతును జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేయబోతున్నట్టు కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అతడు పిల్ వేయడం గమనార్హం. ఈ పిటిషన్ను సుప్రీం కోర్టు వచ్చే వారంలో విచారణ జరపనుంది. ‘రామ్ సేతు’ కు అభిషేక్ శర్మ (Abhishek Sharma)దర్శకత్వం వహిస్తున్నాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బరుచా హీరోయిన్స్గా నటించారు. అరుణ్ భాటియా, విక్రమ్ మల్హోత్రా కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.