Bimbisara: నందమూరి అభిమాని మృతి..

ABN , First Publish Date - 2022-07-30T18:39:05+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన తాజా చిత్రం బింబిసార (Bimbisara). ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో జూలై 29 న హైదరాబాద్ శిల్పకళా వేదిక

Bimbisara: నందమూరి అభిమాని మృతి..

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన తాజా చిత్రం బింబిసార (Bimbisara). ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో జూలై 29 న హైదరాబాద్ శిల్పకళా వేదిక నందు ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అనుకోని విషాదం చోటుచేసుకుంది. ఈ ఈవెంట్‌కు వచ్చిన అభిమానుల్లో పుట్టా సాయి రామ్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతనిది పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం. అయితే, ఈ సంఘటనపై ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థ బృందం స్పందించింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. దీనిలో.. "పుట్టా సాయి రామ్ హఠాత్మరణానికి చింతిస్తూ తన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. తన కుటుంబనికి అండగా ఉంటాము"..అని పేర్కొన్నారు.  


ఇక ఈ ఈవెంట్‌కు హీరో కళ్యాణ్ రామ్ సోదరుడు పాన్ ఇండియన్ స్టార్ ఎన్.టి.ఆర్ (NTR) ముఖ్య అథిదిగా హాజరయ్యారు. కాగా, ఈ సినిమాతో మల్లిడి వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో కేథరిన్ ట్రెస్సా (Catherine tressa) హీరోయిన్‌గా.. సంయుక్తమీనన్, వరీనా హుస్సేన్, ప్రకాశ్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ MM కీరవాణి (MM Keeravani) అందించగా... చిరంతన్ భట్ (Chiranthan Bhatt) సాంగ్స్ కంపోజ్ చేశాడు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థలో నిర్మితమవుతోంది. 



Updated Date - 2022-07-30T18:39:05+05:30 IST