డబ్బులు ఖర్చు చేసి సన్నగా మారాలనుకున్నాను.. కానీ..: బిగ్బాస్ బ్యూటీ
ABN , First Publish Date - 2022-03-09T22:40:03+05:30 IST
డబ్బులు ఖర్చు చేసి సన్నగా మారాలనుకున్నాను.. కానీ..: బిగ్బాస్ బ్యూటీ
హిందీ రియాలిటీ షో ‘బిగ్ బాస్-15’ విన్నర్గా నిలిచి ప్రేక్షకులకు చేరువైన సుందరి తేజస్వీ ప్రకాష్. ప్రస్తుతం హిందీ సిరీయల్ ‘నాగిన్-6’లో కీలక పాత్రను పోషిస్తుంది. ఆమె తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. ఓ యాడ్ చేసినందుకు హీరో కంటే అధికంగా తనకు పారితోషికం చెల్లించారని ఆమె తెలిపింది. బాడీ షేమింగ్ గురించి కూడా మాట్లాడింది.
బరువు ఎక్కువగా ఉన్నవారు మాత్రమే బాడీ షేమింగ్కు గురవుతారని అందరూ భావిస్తారని తేజస్వీ చెప్పింది. బక్క పలుచగా ఉన్నవారు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించింది. ‘‘కెరీర్ ప్రారంభమైనప్పుడు నేను బక్క పలుచగా ఉండేదానిని. నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. చాలా మంది తమ శరీరంపై డబ్బులు వెచ్చిస్తున్నారు. నేను కూడా డబ్బులు ఖర్చు చేసి సన్నగా మరాలనుకున్నాను. కానీ, ఇతరుల కామెంట్స్తో నేను మారకూడదని నిర్ణయించుకున్నాను’’ అని తేజస్వీ ప్రకాష్ చెప్పింది.
సినీ ఇండస్ట్రీ గురించి కూడా తేజస్వీ మాట్లాడింది. ‘‘నేను ఓ యాడ్ చేశాను. హీరో కంటే అధికంగా నాకు పారితోషికం ఇచ్చారు. మీ జాబ్లో నైపుణ్యాన్ని బట్టే మీకు డబ్లులు చెల్లిస్తారు’’ అని ఆమె వివరించింది. తేజస్వీ ప్రస్తుతం కరణ్ కుంద్రాతో డేటింగ్ చేస్తుంది. బిగ్బాస్ కంటెస్టెంట్లుగా ఉన్నప్పుడు వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు.