Boney Kapoor నుంచి రూ.3.82 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు.. బ్యాంకు నుంచి ఫోన్ వచ్చాకే అసలు నిజం తెలిసి..

ABN , First Publish Date - 2022-05-29T01:46:57+05:30 IST

భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే బడా నిర్మాత బోనీ కపూర్‌ (Boney Kapoor)ను సైబర్ నిందితులు బోల్తా కొట్టించారు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డు ద్వారా లక్షలు దోచుకున్నారు. ఈ విషయంపై బోనీ కపూర్

Boney Kapoor నుంచి రూ.3.82 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు.. బ్యాంకు నుంచి ఫోన్ వచ్చాకే అసలు నిజం తెలిసి..

భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించే బడా నిర్మాత బోనీ కపూర్‌ (Boney Kapoor)ను సైబర్ నిందితులు బోల్తా కొట్టించారు. బోనీ కపూర్ క్రెడిట్ కార్డు ద్వారా లక్షలు దోచుకున్నారు. ఈ విషయంపై అతడి సహాయకులు మే 25న అంబోలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.  


బోనీ కపూర్ క్రెడిట్ కార్డు, పాస్ వర్డ్‌ ఇతర వివరాలను కేటుగాళ్లు చోరీ చేసినట్టు తెలుస్తోంది. ఈ డేటా సహాయంతో ఫిబ్రవరి 9న ఐదు ఆన్‌లైన్ ట్రాన్స్‌క్షన్స్ చేశారు. ఈ లావాదేవీలల్లో మొత్తంగా రూ. 3.82లక్షలను నిందితులు కొట్టేశారు. ఈ ట్రాన్స్క్షన్స్ అతడికి తెలియకుండా జరిగాయని పోలీసులు తెలిపారు. బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు బిల్లు నిమిత్తం బోనీ కపూర్‌కు ఫోన్ వచ్చింది. అకౌంట్ చెక్ చేసినప్పుడు మాత్రమే ఆ డబ్బు దోచుకున్నట్టు గ్రహించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నిర్మాతగా బోనీ కపూర్ అనేక సినిమాలను నిర్మించాడు. అజిత్ హీరోగా నటించిన ‘వలీమై’(Valimai), పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) సినిమాలకు  నిర్మాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం అజయ్ దేవగణ్‌తో ‘మైదాన్’(Maidaan)ను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.

Updated Date - 2022-05-29T01:46:57+05:30 IST