కోవిడ్ ఇంకా పోలేదు జాగ్రత్త: Varalaxmi Sarathkumar

ABN , First Publish Date - 2022-07-17T18:41:37+05:30 IST

విలక్షణ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) కోవిడ్ బారిన పడ్దారు. ఆమె స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మన సౌత్ సినిమాలలో కేవలం హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా

కోవిడ్ ఇంకా పోలేదు జాగ్రత్త: Varalaxmi Sarathkumar

విలక్షణ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar) కోవిడ్ బారిన పడ్దారు. ఆమె స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మన సౌత్ సినిమాలలో కేవలం హీరోయిన్ పాత్రల్లో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో నటించి మెప్పించే స్టార్ నటీమణులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, హీరోయిన్స్ మాదిరిగా కాకుండా ప్రతీ భాషలోనూ ఇలాంటి నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ లో అలాంటి పేరు తెచ్చుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. 


ఇటు తెలుగులో అటు తమిళంలో ఆమె కోసం  ప్రత్యేకంగా అద్భుతమైన పాత్రలు తయారవుతున్నాయి. 2019లో తెనాలి రామకృష్ణ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వరలక్ష్మీ 2021లో మాస్ మహారాజ రవితేజ (Raviteja) హీరోగా వచ్చిన 'క్రాక్' సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత వచ్చిన అల్లరి నరేష్ 'నాంది' మూవీ కూడా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో తెలుగులో ఆమెకి మంచి పాత్రలు చేసే అవకాశం దక్కుతోంది.


ప్రస్తుతం సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న 'యశోద' (Yashoda) సినిమాతో పాటు బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం లోనూ కీలక పాత్రలు చేస్తున్నారు. అయితే, ఈ విలక్షణ నటి కోవిడ్ బారిన పడ్డారు. తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ఇందులో ఆమె 'తన తోటి నటులు సినిమా క్రూ అంతా కూడా మాస్క్ లు పెట్టుకోవాలని సూచించారు. అలాగే, ఇటీవల తనని కలిసిన వారు తప్పకుండా టెస్ట్ చేయించుకోమని.. కోవిడ్ ఇంకా పోలేదు జాగ్రత్తగా ఉండాలి'.. అని ఆమె కోరారు. 



Updated Date - 2022-07-17T18:41:37+05:30 IST