Alia Bhatt పై ఎఫ్ఐఆర్ నమోదు.. కారణమేమిటంటే..
ABN , First Publish Date - 2021-12-17T15:11:17+05:30 IST
బాలీవుడ్లో మంచి పాపులారటీ ఉన్న నటీమణుల్లో అలియా భట్ ఒకరు. అందంతోపాటు నటనతోనూ దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ...
బాలీవుడ్లో మంచి పాపులారటీ ఉన్న నటీమణుల్లో అలియా భట్ ఒకరు. అందంతోపాటు నటనతోనూ దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ భామపై ముంబైలో ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిబంధనల ప్రకారం కోవిడ్ వచ్చిన రాకపోయిన.. పాజిటివ్ వచ్చిన వారితో కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ 14 రోజులు క్యారెంటైన్లో ఉండాలి. కానీ ఈ రూల్స్ అతిక్రమిస్తూ అలియాభట్ ఢిల్లీలో తన కొత్త చిత్రం ‘బ్రహ్మస్త్ర’ మోషన్ పోస్టర్ లాంఛ్ కోసం రణ్బీర్ కపూర్తో కలిసి వెళ్లింది. అంతేకాకుండా అక్కడ ఎంతోమంది ప్రజలను కలిసింది. దీంతో పాండామిక్ చట్టం కింద ఈ బ్యూటీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సిద్దమవుతోంది బీఎంసీ.
దీని గురించి బీఎంసీ పబ్లిక్ హెల్త్ కమీటీ ప్రెసిడెంట్ రాజు పటేల్ మాట్లాడుతూ.. ‘ఇంటిలో ఐసోలేషన్ రూల్స్ని అతిక్రమించినందుకు అలియా భట్ మీద కేసు నమోదు చేసేందుకు డీఎంసీ ఆరోగ్య శాఖకి ఆర్డర్స్ జారీ చేశాను. ఆమె చాలా మందికి రోల్ మోడల్. అలాంటి వాళ్లు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. నిబంధనలు అందరికి సమానమేన’ని చెప్పారు.
ఢిల్లీలో ఉన్న అలియా భట్ గురించి తెలుసుకోవడానికి ఆమె మేనేజర్ బుధవారం కాంటాక్ట్ చేసింది బీఎంసీ. నిబంధనలు అతిక్రమించినట్లు తెలిపిన హెల్త్ డిపార్ట్మెంట్ అలియాని అక్కడే ఉండాలని చెప్పింది. కానీ దాన్ని కూడా బ్రేక్ చేసిన ఈ బ్యూటీ నిన్న రాత్రి ముంబైకి తిరిగి వచ్చింది. దీంతో పాండామిక్ యాక్ట్ కింద ఈ భామపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమైంది బీఎంసీ.
అయితే, గత మూడు రోజులుగా ఆరుగురు బాలీవుడ్ సెలబ్రిటీలకి కరోనా పాజిటివ్ వచ్చింది. కరీనా కపూర్, మలైకా అరోరా, అమృతా అరోరా, మహిప్ కపూర్, షానయ కపూర్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో ఉన్నారు. దీంతో ఆందోళన చెందుతున్న మున్సిపల్ కార్పోరేషన్ గట్టిగా యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైంది.