బీ టౌన్ బ్యూటీ ఇషాగుప్తాకు కరోనా
ABN , First Publish Date - 2022-01-10T00:08:01+05:30 IST
బాలీవుడ్ సెలెబ్రిటీలను కరోనా వెంటడుతూనే ఉంది. కరీనా కపూర్, అర్జున్ కపూర్, శనయ కపూర్, మదుర్ బండార్కర్, నోరా ఫతేహీ
బాలీవుడ్ సెలెబ్రిటీలను కరోనా వెంటడుతూనే ఉంది. కరీనా కపూర్, అర్జున్ కపూర్, శనయ కపూర్, మదుర్ బండార్కర్, నోరా ఫతేహీ తదితరులందరు కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో బాలీవుడ్ సెలెబ్రిటీ ఇషాగుప్తాకు కరోనా సోకింది.
ఇన్స్టాగ్రాం స్టోరీస్లో ఆమె ఒక మెసేజ్ను షేర్ చేసింది. ‘‘ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికి నాకు కరోనా సోకింది. నేను అన్ని రకాల నిబంధనలను పాటిస్తున్నాను. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాను. నేను కరోనా నుంచి త్వరగానే కోలుకుని తిరిగి వస్తాను. అందరు జాగ్రత్తగా ఉండండి. మాస్క్ను తప్పకుండా ధరించండి. మాస్క్ను ధరించడం మాత్రం మరవకండి ’’ అని ఇషాగుప్తా తెలిపింది.
‘‘ ఇన్విజిబుల్ ఉమెన్ ’’ అనే వెబ్ సిరీస్లో ఇషాగుప్తా నటిస్తోంది. ఆ వెబ్ సిరీస్లో సునీల్ శెట్టి సరసన ఆమె కనిపించబోతోంది. యాక్షన్ థ్రిల్లర్గా ఆ వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది. రాజేశ్ ఎం. సెల్వ దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె బాక్సింగ్ను నేర్చుకుంటోంది.