Movie Tickets Rates: హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2021-12-15T03:21:47+05:30 IST
సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ సినిమా థియేటర్ల యజమానులు హైకోర్టులో పిటీషన్ వేయగా.. పిటీషన్ను పరిశీలించిన హైకోర్ట్ మంగళవారం ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.35ను సస్పెండ్ చేసింది. హైకోర్ట్ తీర్పు అనంతరం అధికారులతో
సినిమా టికెట్ల రేట్లపై హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. హైకోర్ట్ తీర్పును సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ సినిమా థియేటర్ల యజమానులు హైకోర్టులో పిటీషన్ వేయగా.. పిటీషన్ను పరిశీలించిన హైకోర్ట్ మంగళవారం ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.35ను సస్పెండ్ చేసింది. హైకోర్ట్ తీర్పు అనంతరం అధికారులతో చర్చలు జరిపిన ఏపీ సర్కార్.. ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తాజాగా సమాచారం అందుతోంది.