KGF నిర్మాతల నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్..

ABN , First Publish Date - 2022-06-11T19:03:20+05:30 IST

కేజీఎఫ్ (KGF) నిర్మాతల నుంచి మరో పాన్ ఇండియా చిత్రం రాబోతోంది. హోంబలే ఫిలింస్ (Hombale Filims) నిర్మాణ సంస్థ నుంచి నిర్మాత విజయ్ కిరంగదూర్ (Vijay Kirgandur) అందించిన కేజీఎఫ్ సిరీస్

KGF నిర్మాతల నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్..

కేజీఎఫ్ (KGF) నిర్మాతల నుంచి మరో పాన్ ఇండియా చిత్రం రాబోతోంది. హోంబలే ఫిలింస్ (Hombale Filims) నిర్మాణ సంస్థ నుంచి నిర్మాత విజయ్ కిరంగదూర్ (Vijay Kirgandur) అందించిన కేజీఎఫ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రాలతో ఒక్కసారిగా సౌత్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా మారింది. ప్రస్తుతం వీరి నుంచి అన్నీ భారీ చిత్రాలే రాబోతున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా సలార్ (Salar) సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 


భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ (Shruthi Haasan) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, హోంబలే వారు కేవలం కన్నడ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా మిగతాభాషల్లో కూడా చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమవున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)తో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా హోంబల్ ఫిలిమ్స్ అధికారికంగా వెల్లడించింది.  


ఈ చిత్రాన్ని కూడా తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు 'టైజన్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సీరియస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో పృథ్విరాజ్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. పృథ్వీరాజ్‌కు మలయాళంలో మాత్రమే కాకుండా మిగతా సౌత్ భాషలలోనూ మంచి ఆదరణ ఉంది. కాబట్టి ఖచ్చితంగా 'టైసన్' పాన్ ఇండియా లెవల్‌లో భారీ హిట్ సాధిస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

Updated Date - 2022-06-11T19:03:20+05:30 IST