Bollywood: రూ. 200కోట్ల మోసం కేసులో జాక్వెలిన్కు సమన్లు.. నోరా ఫతేహీపై ప్రశ్నల వర్షం..
ABN , First Publish Date - 2022-09-03T23:48:56+05:30 IST
మనీ లాండరింగ్ కేసులో ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాన్బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్లకు
మనీ లాండరింగ్ కేసులో ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాన్బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివిందర్ సింగ్లకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల నుంచి ఏకంగా రూ.200కోట్లను వసూలు చేసిన చేసిన కేసులో సుకేశ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆర్థిక మోసం కేసులో అనేక మంది బాలీవుడ్ తారలు, మోడల్స్ కూడా చిక్కుకున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కొంత మందికి సమన్లు కూడా అందజేశారు.
ఆర్థిక మోసం కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను (Jacqueline Fernandez) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే నిందితురాలిగా పేర్కొంది. ఆమెకు వ్యతిరేకంగా ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేసింది. ఈ మోసం గురించి జాక్వెలిన్కు అంతా తెలుసని చెప్పింది. సెప్టెంబర్ 26న తమ ముందు హాజరు కావాలంటూ ఆమెకు సమన్లు అందజేసింది. తాజాగా ఈ కేసులోనే మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహీ (Nora Fatehi)ని ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. సెప్టెంబర్ 2న ఆరుగంటల పాటు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక వేళ అవసరమైతే సమన్లు జారీ చేస్తామని చెప్పారు. ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.