బుర్రని ఇంటి దగ్గర పెట్టొచ్చారా.. విలేకర్లపై విరుచుకుపడ్డ బాలీవుడ్ హీరో
ABN , First Publish Date - 2022-03-29T19:53:50+05:30 IST
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎటాక్’. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్..
బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎటాక్’. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా మరో హీరోయిన్గా నటిస్తోంది. ఏప్రిల్ 1న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్లో చిత్ర బృందం బిజీగా ఉంది. ఇందులో భాగంగా జరిగిన ఓ మీటింగ్లో రిపోర్టర్లపై జాన్ విరుచుకుపడ్డాడు.
సమావేశంలో ఓ విలేకరి.. ‘మీ సినిమాల్లో ఓవర్ డోస్ యాక్షన్ ఉంటుంది. నలుగురైదుగురితో పోరాడే వరకూ అది బాగానే అనిపిస్తుంది. కానీ, ఏకంగా 200 మందితో ఫైట్ చేయడం, బైక్లను విసిరేయడం, చేతులతో ఛాపర్లను ఆపడం వంటివి చూస్తే మరీ అతిగా అనిపిస్తుంది’ అని అన్నాడు. ఇది జాన్ కోపానికి కారణమైంది. దీంతో జాన్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదని అనగా.. రిపోర్టర్ సత్యమేవ జయతే గురించి అని చెప్పాడు. దానికి.. ‘నేను అటాక్ సినిమా గురించి మాట్లాడుతున్నాను. మీకు అలా చేయడం నచ్చకపోతే నన్ను క్షమించండి. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను’ అంటూ వెటకారంగా మాట్లాడాడు. అంతేకాకుండా.. హీరోయిన్స్ వైపు తిరిగి.. ‘పిచ్చోడు.. చాలా ప్రస్టేషన్లో ఉన్నట్లు ఉన్నాడు’ అన్నాడు.
మరో విలేకరి జాన్ ఫిట్నెస్ గురించి ఓ ప్రశ్న అడగగా.. ‘శారీరకంగా ఫిట్గా ఉండటం కంటే.. కొందరు అడిగే పిచ్చి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. క్షమించండి సార్, మీరు మీ మెదడును ఇంట్లో వదిలేసి వచ్చినట్లు ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరుఫున నేను మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నాను. పర్వాలేదు. మరోసారి బాగా ట్రై చేయండి’ అంటూ అతనిపై కూడా వెటకారంగా మాటల దాడి చేశాడు.
అలాగే మరో రిపోర్టర్తో.. ‘మీరు అంకుల్లాగా పాతవైన పిచ్చి ప్రశ్నలు అడిగితే మీకే ప్రాబ్లెమ్. ఇప్పటి ప్రశ్నలు అడగండి. ‘అటాక్’ సినిమా ఎందుకు ప్రత్యేకమైందో అడగండి. ఈ సినిమాకి సంబంధించిన విషయాలు అడగండి’ అంటూ జాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.