మాజీ మిస్ ఇండియాని మిసెస్ చేసుకోటానికి అప్పులు చేసిన భర్త!

ABN , First Publish Date - 2022-02-15T21:30:49+05:30 IST

బాలీవుడ్ నటి నేహా ధూపియా, అంగద్ బేడి 2018లో వివాహం చేసుకున్నారు. అనంతరం వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు...

మాజీ మిస్ ఇండియాని మిసెస్ చేసుకోటానికి అప్పులు చేసిన భర్త!

బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా నేహా ధూపియా, నటుడు అంగద్ బేడి 2018లో వివాహం చేసుకున్నారు. అనంతరం వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే తాజాగా అంగద్ ఓ ఇంటర్వ్యూలో వారి పెళ్లి గురించి, నేహాని ఇంప్రెస్ చేయడానికి చేసిన పనుల గురించి చెప్పుకొచ్చాడు.


అంగద్ మాట్లాడుతూ.. ‘నేను నేహాని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. ఆ సమయంలో ఆమె బీఎండబ్ల్యూ కారులో తిరుగుతోంది. దీంతో నేను కూడా ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఓ కారు కొనాలనుకున్నాను. అందుకు కొంచెం డబ్బు సేవ్ చేశాను. మిగిలినది అప్పుగా తీసుకుని ఓ కారు కొన్నాను’ అని చెప్పుకొచ్చాడు.


ఈ విషయం గురించి నేహా మాట్లాడుతూ.. ‘నా ప్రేమకి కారుతో సంబంధం లేదు. నేను వాగ్దానం చేయగలను. లవ్‌కి ఏది అవసరం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు జరిగిపోతుంది అంతే’ అంటూ చెప్పింది. దీనికి సమాధానంగా.. ‘నేహా ఒకే చెప్పేవరకు డబ్బును దాచి కారు కొన్నాను. ఎందుకంటే ఓ పేరున్న హీరోయిన్ కోసం ఆ మాత్రం చేయొచ్చని ఫీల్ అయ్యాను’ అని తెలిపాడు.

Updated Date - 2022-02-15T21:30:49+05:30 IST