వేశ్య పాత్రలో Anasuya Bharadwaj ?
ABN , First Publish Date - 2022-07-04T15:20:18+05:30 IST
యాంకర్గా ఇటు బుల్లి తెరను, నటీమణిగా అటు వెండితెరను బ్యాలెన్స్ చేయడం అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) టాలెంట్. ఈ ఏడాది సినిమాలపరంగా ఆమె స్పీడ్ పెంచుతోంది. విభిన్న ప్రాజెక్ట్స్తో బిజీగా మారబోతోంది.
యాంకర్గా ఇటు బుల్లి తెరను, నటీమణిగా అటు వెండితెరను బ్యాలెన్స్ చేయడం అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) టాలెంట్. ఈ ఏడాది సినిమాలపరంగా ఆమె స్పీడ్ పెంచుతోంది. విభిన్న ప్రాజెక్ట్స్తో బిజీగా మారబోతోంది. ఈ కారణంగానే ఆమె ‘జబర్దస్త్’ (Jabardasth) కామెడీ షో నుంచి యాంకర్గా తప్పుకుందని తెలుస్తోంది. ఆమె మంచి పాత్ర పోషించిన కృష్ణవంశీ (Krishnavamshy) ‘రంగమార్తాండ’ (Rangamarthanda) చిత్రం త్వరలో రెడీ అవుతుండగా.. మెగాస్టార్ ‘గాడ్ఫాదర్’ (Godfather) చిత్రంలో కథను మలుపుతిప్పే ఓ కీలక పాత్ర చేస్తోందని టాక్. త్వరలో ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం షూటింగ్ కోసం అనసూయ సిద్ధంగా ఉంది. ఇంకా మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టుకుంది. వీటన్నిటికన్నా భిన్నంగా అనసూయ ఒక సినిమాలో వేశ్య పాత్ర పోషిస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి.
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) త్వరలో గురజాడ అప్పారావు (Gurajada Apparao) రచించిన ‘కన్యాశుల్కం’ (Kanyasulkam) నాటకాన్ని వెబ్ సిరీస్ గా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు టాక్. ఇందులో మధురవాణిగా అనసూయను ఎంపిక చేశాడట క్రిష్. ఆ పాత్రకోసం ఎంతో మందిని అనుకున్నారట. అయితే ఫైనల్ గా అనసూయను ఎంపికచేశారట. అది మంచి పాత్ర కావడంలో అనసూయ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గతంలో ఈ నాటకం యన్టీఆర్ (NTR) హీరోగా సినిమాగా వచ్చింది. అందులో యన్టీఆర్ గిరీశంగా నటించగా.. సావిత్రి (Savithri) మధురవాణి పాత్రను పోషించారు. అప్పట్లో మహానటి మహాద్భుతంగా చేసిన ఆ పాత్రను ఇప్పుడు అనసూయ చేయనుండడం విశేషంగా మారింది.
ఇప్పటికే పూర్తి స్థాయిలో స్ర్కిప్ట్ వర్క్ రెడీ చేశారట క్రిష్. ఎన్నో సినిమాలకు తన దగ్గర పనిచేసిన సహాయక దర్శకుడికి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించే బాధ్యతను అప్పగించారట . ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawankalyan) తో హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమాను తెరకెక్కించే బిజీలో ఉన్నారు. అతి త్వరలో ‘కన్యాశుల్కం’ వెబ్ సిరీస్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారట. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.