Anasuya Bharadwaj: ‘ఆంటీ’ అంటూ ట్రోలింగ్.. సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేసిన అనసూయ
ABN , First Publish Date - 2022-08-30T20:01:50+05:30 IST
బుల్లితెరపై యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwa) పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే...
బుల్లితెరపై యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwa)కి ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. జబర్దస్త్ అనే కామెడీ షోతో కెరీర్ ప్రారంభించి టాప్ యాంకర్స్(Anchor)లో ఒకరిగా కొనసాగుతోంది. ఆ ఫేమ్తో వెండితెరపై అడుగుపెట్టి వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ సైతం తన హవాని కొనసాగిస్తోంది. ఈ హాట్ యాంకర్ సోషల్ మీడియా (Social Media)లో చాలా యాక్టివ్గా ఉంటుందనే సంగతి విదితమే. అంతేకాకుండా.. నెట్టింట ఆమెపై విమర్శలు చేసే వారిపై సైతం ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది.
అయితే.. పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’.. ఇటీవలే విడుదలై ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అర్జున్ రెడ్డి సినిమాలోని డైలాగులను గుర్తు చేస్తూ.. ‘అమ్మ’ని అన్న పాపం ఊరికేపోదు అంటూ అనసూయ పరోక్షంగా విజయ్పై విమర్శిస్తూ ట్వీట్ చేసింది. అది అర్థమైన విజయ్ ఫ్యాన్స్.. అనసూయని ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. అది తట్టుకోలేక ఓ సమయంలో సైబర్ కేసు పెడతానని కూడా అనసూయ ట్రోలర్స్ని హెచ్చరించింది. అయినా.. ట్రోలర్స్ ఏ మాత్రం వెనక్కితగ్గలేదు. దీంతో తాజాగా హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకి అనసూయ ఫిర్యాదు చేసింది. దీని గురించి తెలుపుతూ ఓ ట్వీట్ చేసింది.
అనసూయ చేసిన ఆ ట్వీట్లో.. ‘నన్ను ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకునే ప్రాసెస్ మొదలైంది. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకూ కేసు పెట్టొద్దనే అనుకున్నాను. కానీ.. చివరికీ ఇలా చేయక తప్పలేదు. సపోర్ట్ చేసిన సైబర్ క్రైమ్ అధికారులకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చింది. అలాగే.. ఈ పోస్ట్కి ‘Say No To Online Abuse’, ‘Stop Age Shaming’ అనే యాష్ట్యాగ్లను కూడా జోడించింది. అంతేకాకుండా.. ఆ కేసుకు సంబంధించిన స్క్రీన్ షాట్ని సైతం షేర్ చేసింది. ఇప్పటికైనా ట్రోలర్స్ వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి మరి.