Anasuya Bharadwaj: రాజకీయం చేయవద్దు..ప్లీజ్‌!

ABN , First Publish Date - 2022-08-20T00:40:00+05:30 IST

హాట్‌ యాంకర్‌ అనసూయకు వివాదాలు కొత్తేమీ కాదు. తరచూ ఏదో విషయమై ఆమె వార్తల్లో ఉంటారు. ఇక సోషల్‌ మీడియా ట్రోలింగ్స్‌ అయితే లెక్కే ఉండదు. తాజాగా మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు అనసూయ. వరుసల ట్వీట్లతో ట్విట్టర్‌ని వేడెక్కించారు. వ్యక్తిగత అభిప్రాయాలకు రాజకీయ రంగు పులమొద్దని నెటిజన్లను కోరారు.

Anasuya Bharadwaj: రాజకీయం చేయవద్దు..ప్లీజ్‌!

హాట్‌ యాంకర్‌ అనసూయకు (Anasuya)వివాదాలు కొత్తేమీ కాదు. తరచూ ఏదో విషయమై ఆమె వార్తల్లో ఉంటారు. ఇక సోషల్‌ మీడియా ట్రోలింగ్స్‌ అయితే లెక్కే ఉండదు. తాజాగా మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు అనసూయ.  వరుసల ట్వీట్లతో ట్విట్టర్‌ని వేడెక్కించారు. వ్యక్తిగత అభిప్రాయాలకు రాజకీయ రంగు పులమొద్దని నెటిజన్లను కోరారు. అసలు విషయం ఏంటంటే.. గుజరాత్‌కు చెందిన బిల్కిస్‌ బానోపై (bilkis bano)సామూహిక అత్యాచార కేసులో విడుదలైన దోషులకు ఓ సంస్థ సన్మానం చేయడంపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ‘‘మన దేశానికి ఇదొక మచ్చ. దోషులను తీసుకొచ్చి పూల మాలలు వేసి సన్మానం చేయడానికి వాళ్లేమైనా స్వాతంత్ర సమరయోధులా, యుద్ధ వీరులా’. ఈరోజు బిల్కిస్‌ బానో.. రేపు ఇంకొకరు కావొచ్చు. ఇప్పుడైనా గళం విప్పండి’ అంటూ కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ను అనసూయ భరద్వాజ్‌ రీట్వీట్‌ చేసి ‘‘ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ేస్వచ్ఛ, స్వాతంత్ర్యాన్ని మనం పునర్నిర్వచిస్తున్నట్లు అనిపిస్తోంది. రేపిస్ట్‌లను వదిలేసి.. మహిళల్ని తలుపు వెనక దాచేస్తున్నాం’ అని రాసుకొచ్చారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. అనసూయపై విమర్శల వర్షం కురిపించారు. ‘‘హైదరాబాద్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగినప్పుడు మాట్లాడని మీరు ఇప్పుడెలా మాట్లాడుతున్నారు’’ అంటూ కామెంట్లు చేశారు. నెటిజన్ల వరుస ట్వీట్లకు అనసూయ సమాధానమిచ్చారు. (Anasuya tweet viral)








‘‘నేను ఏ ట్వీట్‌ చేసినా అది నా అభిరుచి, ఇష్టపూర్వకంగానే జరుగుతాయి. ఒక వ్యక్తినో, సంస్థ, సిద్థాంతాలనో ప్రచారం చేయడానికి కాదు. డబ్బు కోసం అంతకన్నా కాదు. ఒక విషయం మీద పూర్తిగా అవగాహన, సమాచారం ఉంటేనే నేను మాట్లాడతాను. నన్ను మాట్లాడమని కోరినా అవగాహన లేకపోతే వదిలేస్తాను. దాని జోలికి వెళ్లను. ఒకవేళ మాట్లాడితే తప్పుగా అర్థం చేసుకుని నన్ను టార్గెట్‌ చేస్తున్నారు. అందుకే నా సొంత నిర్ణయానికి రాలేకపోతున్నా. కాబట్టి నా ట్వీట్లపై రాజకీయం చేయవద్దు ప్లీజ్‌’’ అని అనసూయ ట్విట్టర్‌ వేదికగా కోరారు. అనసూయ ఎందుకిలా మాట్లాడుతుందో అర్థం కాక ‘‘అనసూయ మీరెందుకు ఇలా ట్వీట్స్‌ చేశారు? ఏమైంది?’’ అని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. 


Updated Date - 2022-08-20T00:40:00+05:30 IST