ఈ సినిమా చేసేటప్పుడు భయం వేసింది : ‘లైగర్’ భామ
ABN , First Publish Date - 2022-02-09T22:53:00+05:30 IST
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో బాలీవుడ్కి ఎంట్రీ తనకంటూ గుర్తింపు పొందిన నటి అనన్య పాండే.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపు పొందిన నటి అనన్య పాండే. ఈ బ్యూటీ పూరీ జగన్నాథ్, యువ నటుడు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’తో అన్ని దక్షిణాది భాషల్లోకి అడుగుపెట్టనుంది. అయితే తాజాగా ఈ భామ నటించిన కొత్త చిత్రం ‘గెహ్రయాన్’ ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. ఈ తరుణంలో జరిగిన ఓ ప్రమోషనల్ ఇంటర్య్వూలో ఈ తార తన కొత్త సినిమా గురించి విశేషాలను పంచుకుంది.
ఈ చిత్రంలోని తన పాత్ర టియా గురించి అనన్య మాట్లాడుతూ.. ‘ఈ మూవీలోని నా పాత్రకి నా జీవితానికి ఎన్నో దగ్గరి పోలికలు ఉన్నాయి. ఉదాహరణకు, ఆ క్యారెక్టర్ జైన్ (సిద్ధాంత్)ను ప్రేమిస్తూ.. అన్ని విషయాల్లోనూ అతనిపై ఆధారపడుతూ ఉంటుంది. అలాగే ఎంతో అమాయకురాలు కూడా. వీటితోపాటు మరోవైపు బంధాల విషయంలో కూడా కొంచెం ఇన్సెక్యూర్గా ఉంటుంది. అలాగే వాటిపై ఆమెకి సొంత నమ్మకాలు ఉంటాయి. అచ్చం అలాంటి లక్షణాలే నాలోనూ ఉన్నాయి’ అని చెప్పుకొచ్చింది.
అలాగే అనన్య ఇంకా మాట్లాడుతూ.. ‘మీరు మీ స్వభావంలో ఉన్నటువంటి క్యారెక్టర్నే పోషిస్తున్నారంటే మీలోని మరో కోణాన్ని కెమెరా ముందు చూపుతున్నట్లే. అది కొన్నిసార్లు భయానకంగా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్నింటిని బయటికి తెలియకుండా దాస్తారు. అంతేకాకుండా నాలోని ఎమోషనల్ యాంగిల్ని అందరికి చూపడం నాకు నచ్చదు. అలాంటి వాటిని బయటికి చూపించాలంటే భయం వేస్తుంది కదా. కానీ నేను ఇప్పుడు దాన్నుంచి పూర్తిగా బయపడ్డాను. ఈ సినిమా కోసం డైరెక్టర్ చెప్పినట్లు చేశాను. తెలియని విషయాలను వదిలేయడం వల్ల ఎంతో ప్రశాంతత ఉంటుందని దీనివల్ల నాకు తెలిసింది’ అని తెలిపింది.
కాగా.. విచిత్ర బంధాలు, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి శకున్ బత్రా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అనన్యతో పాటు దీపిక పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా కూడా ముఖ్య పాత్రలు పోషించారు.