Amitabh ఆగ్రహం : ఆ కంపెనీకి legal నోటీసులు
ABN , First Publish Date - 2021-11-21T17:09:38+05:30 IST
ఓ పాన్ మసాలా బ్రాండ్ ఉత్పత్తిదారులకి అమితాబ్ బచ్చన్ లీగల్ నోటీసులు పంపారు. వారితో తన కాంట్రాక్ట్ రద్దైనప్పటికీ, ఇంకా సదరు పాన్ మసాలా ప్రాడక్ట్ని ప్రచారం చేసుకునేందుకు, అడ్వర్టైజ్మెంట్స్ ప్రసారం చేస్తూనే ఉండటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఓ పాన్ మసాలా బ్రాండ్ ఉత్పత్తిదారులకి అమితాబ్ బచ్చన్ లీగల్ నోటీసులు పంపారు. వారితో తన కాంట్రాక్ట్ రద్దైనప్పటికీ, ఇంకా సదరు పాన్ మసాలా ప్రాడక్ట్ని ప్రచారం చేసుకునేందుకు, అడ్వర్టైజ్మెంట్స్ ప్రసారం చేస్తూనే ఉండటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో బిగ్ బి పాన్ మసాలా బ్రాండ్ను ప్రమోట్ చేసేందుకు అంగీకరించినప్పటికీ తరువాత వెనక్కి తగ్గారు.
ఆరోగ్యానికి హానికరమైన పొగాకు ఉత్పత్తిని అమితాబ్ ప్రచారం చేయటంపై ఆన్లైన్లో పలు విమర్శలు వచ్చాయి. వాటికి ఓ పోగాకు వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకంగా అభ్యర్థించటంతో... అడ్వర్టైజ్మెంట్స్ కాంట్రాక్ట్ని అక్టోబర్ నెలలో టెర్మినేట్ చేసేశారు బాలీవుడ్ సూపర్ స్టార్. అయితే, ఒప్పందం రద్దు అయినప్పటికీ పాన్ మసాలా కంపెనీ మాత్రం అమితాబ్ బచ్చన్ కనిపించే యాడ్స్ని ఇంకా ప్రసారం చేస్తూనే ఉంది. అందుకే, అమితాబ్ లీగల్ నోటీసులు పంపించారని బాలీవుడ్ టాక్.