దుబాయ్‌లో చిల్ అవుతోన్న పుష్పరాజ్

ABN , First Publish Date - 2022-01-28T20:23:28+05:30 IST

ఇటీవల ‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి.. ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరిచింది. ఓటీటీలో సైతం పుష్పరాజ్ తన స్టామినా ఏపాటిదో చాటిచెప్పాడు. ప్రస్తుతం సుకుమార్ టీమ్ ‘పుష్ప ది రూల్’ సినిమాపైనే తమ దృష్టి సారిస్తున్నారు. మొదటి భాగానికి వచ్చిన విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని రెండో భాగాన్ని మరిన్ని జాగ్రత్తలతో తీర్చిదిద్దుతున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో ‘పుష్ప’ రెండో భాగం సెట్స్ పైకి వెళ్లబోతోంది.

దుబాయ్‌లో చిల్ అవుతోన్న పుష్పరాజ్

ఇటీవల ‘పుష్ప’ చిత్రంతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి.. ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరిచింది. ఓటీటీలో సైతం పుష్పరాజ్ సత్తాచాటాడు. ప్రస్తుతం సుకుమార్ టీమ్ ‘పుష్ప ది రూల్’ సినిమాపైనే తమ దృష్టి సారిస్తున్నారు. మొదటి భాగానికి వచ్చిన విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని రెండో భాగాన్ని మరిన్ని జాగ్రత్తలతో తీర్చిదిద్దుతున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో ‘పుష్ప’ రెండో భాగం సెట్స్ పైకి వెళ్లబోతోంది. దానికి ఇంకా టైమ్ ఉండడంతో ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ తన కుటుంబంతో దుబాయ్ టూర్ కు వెళ్లారు. 


దుబాయ్ లోని ముఖ్యమైన ప్రదేశాల్లో కుటుంబ సమేతంగా బన్నీ చిల్ అవుతున్నట్టు తెలుస్తోంది. ‘పుష్ప 2’ షూటింగ్ కోసం ఫిజికల్ గానూ, మెంటల్ గానూ రిఫ్రెష్ అవ్వాలని బన్నీ అనుకుంటున్నారు.  తాజాగా బన్నీ సోషల్ మీడియాలో దుబాయ్ టూర్ కు సంబంధించిన ఫోటోస్ ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ‘పుష్ప 2’ షూటింగ్  కొద్ది రోజులు ఉందనగా.. బన్నీ హైదరాబాద్ లో ల్యాండ్ అవనున్నారు. ‘పుష్ప ది రైజ్’ చిత్రాన్ని వీలైనన్ని భారతీయ భాషల్లో విడుదల చేసే ఉద్దేశంతో ఉన్నారు మేకర్స్.  



Updated Date - 2022-01-28T20:23:28+05:30 IST