AlluRG100: ఈసారి అల్లు రామలింగయ్య నేషనల్ అవార్డ్ పురస్కారం ఎవరికంటే..?
ABN , First Publish Date - 2022-10-02T03:13:37+05:30 IST
పద్మశ్రీ అల్లు రామలింగయ్య (allu ramalingaiah) శత జయంతి (అక్టోబర్ 1) సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ (allu aravind) నేతృత్వంలో.. శనివారం
పద్మశ్రీ అల్లు రామలింగయ్య (allu ramalingaiah) శత జయంతి (అక్టోబర్ 1) సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ (allu aravind) నేతృత్వంలో.. శనివారం ఉదయం అల్లు రామలింగయ్య పేరు మీద రూపొందించిన ఫిల్మ్ స్టూడియో ‘అల్లు స్టూడియోస్’ (Allu Studios)ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇక అల్లు రామలింగయ్య పేరు మీద ఇచ్చే జాతీయ పురస్కారం, అలాగే ఆయన పేరు మీద బుక్ లాంచ్ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం హైదరాబాద్ పార్క్ హయాత్లో గ్రాండ్గా నిర్వహించారు. అల్లు ఫ్యామిలీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) ముఖ్య అతిథిగా హాజరవగా.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan) వంటి వారంతా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని.. అల్లు రామలింగయ్య పట్ల తమ ప్రేమను చాటుకున్నారు.
ఈ సంవత్సరం అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని సుప్రసిద్ధ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) అందుకున్నారు. అందులో భాగంగా త్రివిక్రమ్కు అల్లు అర్జున్ (Allu Arjun) స్వర్ణకంకణాన్ని తొడిగారు. ఇంతకుముందు ఈ అవార్డును దర్శకుడు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao), నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) వంటివారు అందుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కమెడియన్లు అందరూ హాజరై.. అల్లు రామలింగయ్యతో తమకున్న అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. (Allu Ramalingaiah National Award)