SIIMA: అవార్డ్స్‌లో ‘పుష్ప’ ప్రభంజనం

ABN , First Publish Date - 2022-09-11T20:46:42+05:30 IST

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise). రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించాడు. ఈ

SIIMA: అవార్డ్స్‌లో ‘పుష్ప’ ప్రభంజనం

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise). రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. లెక్కల మాస్టారు సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పాన్ ఇండియాగా రూపొందింది. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందింది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ‘పుష్ప’ తాజాగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ (సైమా) (SIIMA) అవార్డ్స్‌లో ప్రభంజనం సృష్టించింది. పలు విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ కాగా ఆరు అవార్డ్‌లను కైవసం చేసుకుంది.


బెస్ట్ యాక్టర్- అల్లు అర్జున్, బెస్ట్ డైరెక్టర్- సుకుమార్, బెస్ట్ మ్యూజిక్- దేవి శ్రీ ప్రసాద్, బెస్ట్ లిరిసిస్ట్- చంద్రబోస్, బెస్ట్ సపోర్టింగ్ రోల్ - జగదీష్, బెస్ట్ తెలుగు మూవీ వంటి కేటగీరీల్లో ‘పుష్ప: ది రైజ్’ పురస్కారాలను సొంతం చేసుకుంది. బన్నీ ఉత్తమ నటుడి అవార్డును అందుకుంటున్నప్పుడు ‘తగ్గెదేలె’ డైలాగ్ చెప్పి అక్కడున్న వారిని ఆకట్టుకున్నాడు. సైమా 10వ ఎడిషన్ బెంగళూరులో సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. ఈ వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. సైమా అవార్డ్స్‌ను అందజేయడం 2012నుంచి మొదలైంది. తాజాగా 10వ సారి పురస్కారాలను ఇస్తున్నారు. బెంగళూరులోని గార్డెన్ సిటీలో సైమా అవార్డ్స్‌ను అందజేస్తున్నారు. ఈ ఫంక్షన్‌కు తొలి రోజు కమల్ హాసన్ (KamalHaasan), అల్లు అర్జున్, యశ్ (Yash), రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. గతేడాది సైమా అవార్డ్స్‌ను హైదరాబాద్‌‌లో ప్రదానం చేశారు.




Updated Date - 2022-09-11T20:46:42+05:30 IST