Allu Arjun: అంతర్జాతీయ వేదికపై ‘పుష్ప: ది రైజ్’ కు అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2022-09-01T20:40:55+05:30 IST

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). ప్రతి సినిమాలోను వైవిధ్యం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ‘సరైనోడు’, ‘నా పేరు సూర్య నా

Allu Arjun: అంతర్జాతీయ వేదికపై ‘పుష్ప: ది రైజ్’ కు అరుదైన గౌరవం

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నటుడు అల్లు అర్జున్ (Allu Arjun). ప్రతి సినిమాలోను వైవిధ్యం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ‘సరైనోడు’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘అల వైకుంఠపురం’ చిత్రాలతో అభిమానులను అలరించాడు. తాజాగా అతడు నటించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise). లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. పాన్ ఇండియాగా రూపొందిన ఈ సినిమాకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ‘పుష్ప’ విడుదలై ఏడాది కావస్తున్నా అంతర్జాతీయంగా కూడా ఈ చిత్రం గురించి అందరు చర్చించుకుంటున్నారు. ఈ మూవీకి తాజాగా అరుదైన గౌరవం లభించింది. 


‘పుష్ప: ది రైజ్’ ను మాస్కో ఫిలిం ఫిస్టివల్‌లో ప్రదర్శించారు. బ్లాక్‌బస్టర్స్ కేటగీరీ కింద ఈ చిత్రాన్ని స్క్రీన్ చేశారు. ఈ విషయాన్ని మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ఓ మెసేజ్‌ను షేర్ చేసింది. ‘‘మాస్కో ఫిలిం ఫెస్టివల్‌ బ్లాక్‌బస్టర్ హిట్స్ కేటగీరీ‌లో ‘పుష్ప: ది రైజ్: పార్ట్-1’ ఎంపికయిందని చెప్పేందుకు గర్విస్తున్నాం’’ అని ఎంబసీ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ‘పుష్ప’ చిత్రం బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకోవాలని సుకుమార్ గత కొంతకాలంగా స్క్రిఫ్ట్‌పై పనిచేస్తున్నాడు. ‘పుష్ప: పార్ట్-2’ షూటింగ్‌ను త్వరలోనే  ప్రారంభించే అవకాశం ఉంది. ‘పుష్ప: ది రైజ్’ లో రష్మక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), సునీల్, ధనుంజయ, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.



Updated Date - 2022-09-01T20:40:55+05:30 IST