Allu Arjun: తాత గురించి చెప్తుంటే కళ్ళ నీళ్ళు పెట్టుకున్న అల్లు అర్జున్

ABN , First Publish Date - 2022-10-02T20:29:58+05:30 IST

అక్టోబర్ 1 ఒకప్పటి కమెడియన్, నటుడు అల్లు రామలింగయ్య (Allu ramalingiah) వందో పుట్టిన రోజు. (100th birthday) అయన స్మారకార్థం (Memorial award) అతని కొడుకు, అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ (Allu Aravind), అల్లు రామలింగయ్య జాతీయ అవార్డుని (National Award) ప్రతి ఏటా ఇస్తూ వస్తున్నారు.

Allu Arjun: తాత గురించి చెప్తుంటే కళ్ళ నీళ్ళు పెట్టుకున్న అల్లు అర్జున్

అక్టోబర్ 1 ఒకప్పటి కమెడియన్, నటుడు అల్లు రామలింగయ్య (Allu ramalingiah)  వందో పుట్టిన రోజు. (100th birthday) అయన స్మారకార్థం (Memorial award) అతని కొడుకు, అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ (Allu Aravind), అల్లు రామలింగయ్య జాతీయ అవార్డుని (National Award) ప్రతి ఏటా ఇస్తూ వస్తున్నారు. తండ్రి చనిపోయి 18 ఏళ్ళు అవుతున్నా ఒక్క ఏడాది కూడా వదలకుండా ఈ అవార్డు వేడుక చేస్తున్నారు..ఈ ఏడాది వందో పుట్టినరోజు కాబట్టి ఇంకా ఘనంగా నిర్వహించారు. శనివారం ఒక హోటల్ లో జరిగిన ఈ అవార్డు వేడుక కి అల్లు కుటుంబ (Allu family members) సభ్యులు అల్లు అర్జున్ (Allu Arjun) తో సహా అందరూ హాజరయ్యారు. అలాగే అల్లు రామలింగయ్య అల్లుడు (Allu son-in-law) మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కూడా వచ్చారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుని దర్శకుడు, రచయిత అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఈ ఏడాది అందుకున్నారు. అవార్డు తీసుకున్న తరువాత త్రివిక్రమ్ చాల భావోద్వేగమయిన (Emotional speech) మాటల్లో అల్లు రామలింగయ్య గురించి చెప్పాడు. సుమారు ఒక పావుగంట సేపు మాట్లాడి వుంటాడు త్రివిక్రమ్. కానీ రామలింగయ్య గురింఛి ఎవరికీ తెలియని విషయాలు అయన ఎంతో బావుకతో, మంచి పదాలు వేస్తూ తన చేసిన ప్రసంగం అందరిని మంత్ర ముగ్దుల్ని చేసింది. అలాంగ్ రామలింగయ్య పడ్డ కష్టాలు (Difficulties in life) కూడా త్రివిక్రమ్ తనదయిన శైలిలో చెప్పినప్పుడు రామలింగయ్య మనవుడు అల్లు అర్జున్ ఎంతో భావేద్వేగానికి (Allu Arjun turns emotional) గురయ్యారు. అతని కళ్ల లోంచి నీళ్లు చమర్చాయి. (Cried) వెంటనే తన కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకోవటం కంట పడింది. త్రివిక్రమ్ కూడా అంతే గంభీరంగా రామలింగయ్య గగురించి చెప్తూ ఉండటంతో ప్రేక్షకులు కూడా చాల నిశ్శబ్డంగా విన్నారు. ప్రేక్షకులకే ఆలా అంతలా విని వున్నప్పుడు, మరి కుటుంబ సభ్యుడు ఆయిన అల్లు అర్జున్ కి కళ్లలో నీళ్లు కచ్చితంగా వస్తాయి. వచ్చాయి కూడా. అందుకే అయన కళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ కొన్ని నిముషాల తరువాత మామూలు అయ్యాడు.

అల్లు వారసత్వాన్ని అల్లు అరవింద్, తరువాత అతని కుమారుడు అల్లు అర్జున్ ఇప్పుడు కొనసాగిస్తున్నారు. అల్లు అర్జున్ సినిమా 'పుష్ప' (Pushpa) ప్రపంచం అంత ఎంతలా మారుమోగిందో, ఎంత పేరు తెచ్చి పెట్టిందో అందరికీ తెలిసిన విషయమే. తనికెళ్ళ భరణి ఈ సభకి వ్యాఖ్యాతగా వ్యయవహరించారు. ఇదే సభలో చాలామంది కమెడియన్స్ ని సత్కరించి, సన్మానించారు. 

Updated Date - 2022-10-02T20:29:58+05:30 IST