2022 గ్రాండ్ మార్షల్ ఆఫ్ ఇండియా డే పరేడ్ కి Allu Arjun
ABN , First Publish Date - 2022-07-17T16:52:51+05:30 IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 2022, ఆగస్టు 21న న్యూయార్క్ సిటీలో జరగబోతున్న గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్ కి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోషియేషన్ ప్రకటించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 2022, ఆగస్టు 21న న్యూయార్క్ సిటీలో జరగబోతున్న గ్రాండ్ మార్షల్ ఇండియా డే పరేడ్కి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ప్రకటించింది. న్యూయార్క్ నగరంలో ఇండియా డే పరేడ్, ఆ దేశం బార్డర్లో భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ఈ వేడుకను జరపనున్నారు. దీనికి మన టాలీవుడ్ మెగా-స్టార్ అల్లు అర్జున్ నాయకత్వం వహిస్తారని భారత అసోసియేషన్ల సమాఖ్య ప్రకటించింది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వార్షికోత్వాన్ని నిర్వహించే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోషియేషన్, జూలై 12, 2022న తన 4వ పరేడ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆగస్టు 21న జరగబోతున్న 40వ భారత దినోత్సవ పరేడ్కు నాయకత్వం వహించే ప్రముఖులను ప్రకటించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ యొక్క 40వ గ్రాండ్ మార్షల్గా 'పుష్ప' ఫేమ్ మెగా స్టార్ అల్లు అర్జున్ ఉంటారని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోషియేషన్ అధ్యక్షుడు కెన్నీ దేశాయ్ ప్రకటించారు.
భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలను సైతం ఈ వేడుకలో నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈ గ్రాండ్ ఈవెంట్లకు సంబంధించిన వివరాలను కూడా ఆయన ప్రకటించారు. కాగా, అల్లు అర్జున్తో పాటు NYC మేయర్ ఎరిక్ ఆడమ్స్ సహా ఇతర ప్రముఖులు, సెలబ్రిటీలు ఉంటారని FIA నుండి ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.