బన్నీ పారితోషికం రెట్టింపయ్యిందా?

ABN , First Publish Date - 2022-05-02T15:19:14+05:30 IST

కాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇటీవల ‘పుష్ప ది రైజ్’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించాడు. విడుదలైన అన్ని భాషల్లోనూ, ఓవర్సీస్ లోనూ కలెక్షన్స్ మోత మోగించింది చిత్రం. ముఖ్యంగా బాలీవుడ్‌లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబ్టటింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండో భాగమైన ‘పుష్ప ది రూల్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలైలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆ లోపు స్ర్కిప్ట్ లో భారీ మార్పులు చేస్తున్నారు సుక్కూ అండ్ టీమ్.

బన్నీ పారితోషికం రెట్టింపయ్యిందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇటీవల ‘పుష్ప ది రైజ్’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించాడు. విడుదలైన అన్ని భాషల్లోనూ, ఓవర్సీస్ లోనూ కలెక్షన్స్ మోత మోగించింది చిత్రం. ముఖ్యంగా బాలీవుడ్‌లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబ్టటింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండో భాగమైన ‘పుష్ప ది రూల్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలైలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆ లోపు స్ర్కిప్ట్ లో భారీ మార్పులు చేస్తున్నారు సుక్కూ అండ్ టీమ్. అలాగే రెండో భాగంలో రెండు,  మూడు కొత్త పాత్రల్ని ప్రవేశపెడుతున్నారు.  ఇక మొదటి భాగం తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ వల్ల బన్నీ ‘పుష్ప ది రూల్’ చిత్రం కోసం తన పారితోషికాన్ని రెట్టింపు చేశాడనే వార్తలొస్తున్నాయి. పుష్ప మొదటి భాగం కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ. 50 కోట్లు పారితోషికం అందుకున్నాడని సమాచారం. 


తాజా సమాచారం ప్రకారం ‘పుష్ప ది రూల్’ కోసం బన్నీ రూ. 100 కోట్లు పారితోషికం అందుకోబోతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. మైత్రీ వారు బన్నీ కోరిన విధంగానే అంత ఎక్కువ మొత్తం పారితోషికం ఇవ్వడానికి అంగీకరించారట. తన కెరీర్‌లోనే  మొట్ట మొదటి పాన్ ఇండియా చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాకుండా.. అత్యధిక మొత్తాన్ని పారితోషికంగా అందుకోవడం.. రెండో భాగానికి రెట్టింపు డిమాండ్ చేయడం అల్లు అర్జున్ కు మాత్రమే చెల్లింది. రెండో భాగం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే .. తదుపరి చిత్రం కోసం అతడు ఇంకెంత డిమాండ్ చేస్తాడో చూడాలి.  

Updated Date - 2022-05-02T15:19:14+05:30 IST