Alia Bhatt: కనుల పండువగా సీమంతం.. వైరల్‌గా మారిన పిక్స్..

ABN , First Publish Date - 2022-10-07T01:49:41+05:30 IST

చిన్న తనంలోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ ఆలియా భట్ (Alia Bhatt). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ తో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా రంగప్రవేశం చేసింది.

Alia Bhatt: కనుల పండువగా సీమంతం.. వైరల్‌గా మారిన పిక్స్..

చిన్న తనంలోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ ఆలియా భట్ (Alia Bhatt). ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ తో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా రంగప్రవేశం చేసింది. కెరీర్ ప్రారంభించినప్పుడు అనేక విమర్శలు ఎదుర్కొంది. అనంతరం ‘టూ స్టేట్స్’, ‘హైవే’, ‘రాజీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఆమెకు ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ సమయంలో రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor) తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఈ జంట ఏడేళ్ల పాటు డేటింగ్ చేశారు. ఏప్రిల్ 14న సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వివాహం అయిన మూడు నెలల్లోపే  ఈ దంపతులు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాము త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామని వెల్లడించారు. తాజాగా ఆలియా భట్ సీమంతం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. నెటిజన్స్ అందరు షేర్ చేస్తున్నారు. 


ఆలియా సీమంతం వేడుకకు నీతూ కపూర్, కరిష్మా కపూర్, సోనీ రజ్దానీ, షాహీన్ భట్ తదితరులు హాజరయ్యారు. సీమంతానికి సంబంధించిన ఫొటోలను ఆలియా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘‘జస్ట్ లవ్’’ అని క్యాప్షన్ ఇచ్చింది. సీమంతం చేసుకోవడంతో అనేక మంది సెలబ్రిటీలు ఆలియాకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పారు. రణ్‌బీర్, ఆలియా కలసి తొలిసారిగా ‘బ్రహ్మాస్త్ర’ (Brahmāstra) లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న విడుదల అయింది. వరల్డ్ వైడ్‌ బాక్సాఫీస్ వద్ద రూ.450కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 




Updated Date - 2022-10-07T01:49:41+05:30 IST