Followersని పెంచుకోడానికే ఆ పిక్స్ పోస్ట్ చేశారా?.. అని అడిగితే.. Alia Bhatt రియాక్షన్ ఇదీ..

ABN , First Publish Date - 2022-06-26T17:47:11+05:30 IST

బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కపుల్స్‌లో అలియా భట్, రణబీర్ కపూర్ (Ranbir Kapoor) జంట ఖచ్చితంగా..

Followersని పెంచుకోడానికే ఆ పిక్స్ పోస్ట్ చేశారా?.. అని అడిగితే.. Alia Bhatt రియాక్షన్ ఇదీ..

బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కపుల్స్‌లో అలియా భట్, రణబీర్ కపూర్ (Ranbir Kapoor) జంట ఖచ్చితంగా ఉంటుంది. దాదాపు ఐదేళ్ల నుంచి డేటింగ్ చేస్తున్న ఈ జంట ఏప్రిల్ 14న పెళ్లి బంధంతో ఒకటయ్యింది. అయితే.. వీరి మ్యారేజ్ ఎంతో రహస్యంగా జరిగింది. దీంతో వివాహం తర్వాత వాటి సంబంధించిన పలు ఫొటోలను అలియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆ పిక్స్ వైరల్‌గా మారిపోయాయి. అయితే.. ఫాలోవర్స్‌ని పెంచుకోవడం కోసమే ఈ ఫొటోలని ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో షేర్ చేసిందని పలువురు నెటిజన్లు విమర్శలు చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్‌పై అలియా స్పందించింది.


అలియా మాట్లాడుతూ.. ‘నాకు ఏదైనా పిక్‌ని షేర్ చేయాలని అనిపించినప్పుడు వాటిని పోస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా నా ఫాలోవర్స్ (Followers) చూపించాలని, నేను ఫీల్ అయిన వాటిని మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. కాబట్టి.. నేను ఒక చిత్రాన్ని పోస్ట్ చేస్తే ఆ సమయంలో అనుభూతి చెందడం వల్లే షేర్ చేస్తున్నాను. అంతేకానీ.. నా ఫాలోవర్స్‌ని పెంచుకోవడం కోసం కాదు’ అని చెప్పుకొచ్చింది. అలియాకి ఇన్‌స్టాగ్రామ్‌లో 66 మిలియన్లకి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కాగా.. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్ (RRR)’తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అలియా తాజాగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త’. సెప్టెంబర్ 9న విడుదలకానున్న ఈ చిత్రంలో హీరోగా ఈ బ్యూటీ భర్త రణ్‌బీర్ కపూర్ నటించాడు. అలాగే.. ఫరాన్ అక్తర్ దర్శకత్వంలో ‘జీ లే జారా’, ఒక హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది.



Updated Date - 2022-06-26T17:47:11+05:30 IST