Bigg Boss Telugu 5 Finale: కంటెస్టంట్లకు రణబీర్ ముద్దులు.. సన్నీకి అలియాభట్.. లవ్ ప్రపోజల్..
ABN , First Publish Date - 2021-12-20T01:37:18+05:30 IST
గతంలో ఎన్నడూ లేనంతగా.. బిగ్బాస్ సీజన్-5 గ్రాండ్ ఫినాలే మరికొద్దిసేపట్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇదిలావుండగా.. ఈ షోను ఫాలో అయ్యేవారంతా.. విన్నర్ ఎవరు అవుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
గతంలో ఎన్నడూ లేనంతగా.. బిగ్బాస్ సీజన్-5 గ్రాండ్ ఫినాలే మరికొద్దిసేపట్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇదిలావుండగా.. ఈ షోను ఫాలో అయ్యేవారంతా.. విన్నర్ ఎవరు అవుతారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే నిర్వాహకులు కూడా.. గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అతిథుల కలయికలో ఈసారి షో.. అభిమానులను మరింతగా ఆకట్టుకోనుంది. ఈ వేడుకలో భాగంగా హీరోయిన్ రష్మిక మందన బిగ్బాస్ ఇంట్లోకి వెళ్లినట్టు తెలిసింది.
సిరిని బయటకు తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన రష్మిక వెళ్లినట్టు చెబుతున్నారు. మరోవైపు మౌనిక స్టేజ్ మీద సామి పాటతో రచ్చ చేసిందని, హౌస్లో రష్మిక స్టెప్పులు వేస్తూ కనిపించిందట. ఇదిలావుండగా, శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్ కోసం నాని, సాయి పల్లవి కూడా స్టేజ్ మీద సందడి చేయనున్నారు. దీంతోపాటు మాజీ కంటెస్టెంట్లు డ్యాన్స్ ఫెర్పామెన్స్తో రచ్చ చేయనున్నారు. మరోవైపు బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్లో భాగంగా రణ్ బీర్ కపూర్, అలియా భట్.. కార్యక్రమంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.
తాజాగా విడుదల చేసిన బిగ్బాస్ సీజన్-5 ప్రోమోలో అలియా భట్, రణబీర్ కపూర్ హల్చల్ చేయడం తెలిసిందే. తెలుగులో ప్రసంగం కొనసాగించిన రణబీర్.. కంటెస్టెంట్లకు, తెలుగువారికి.. నా ముద్దులు అంటూ ఆకట్టుకున్నారు. మరోవైపు అలియా భట్ ఏకంగా సన్నీకి లవ్ ప్రపోజల్ చేసింది. దీంతో సన్నీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మొత్తానికి ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం.. గత కార్యక్రమాల కంటే విభిన్నంగా, సరికొత్తగా ఉన్నట్లు తెలుస్తోంది.