అయ్యయ్యో మరీ ఇంత ఘోరమా..? రూ.200 కోట్ల బడ్జెట్‌తో స్టార్ హీరోతో సినిమాను తీస్తే 10 రోజుల్లో వచ్చింది ఇంతేనా..?

ABN , First Publish Date - 2022-06-13T22:56:31+05:30 IST

బాలీవుడ్‌లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30రోజుల నుంచి 40రోజుల్లోనే సినిమాలను పూర్తి చేస్తుంటాడు. తాజాగా అతడు హీరోగా నటించిన చిత్రం ‘సామాట్ర్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj).

అయ్యయ్యో మరీ ఇంత ఘోరమా..? రూ.200 కోట్ల బడ్జెట్‌తో స్టార్ హీరోతో సినిమాను తీస్తే 10  రోజుల్లో వచ్చింది ఇంతేనా..?

బాలీవుడ్‌లో శరవేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). 30రోజుల నుంచి 40రోజుల్లోనే సినిమాలను పూర్తి చేస్తుంటాడు. తాజాగా అతడు హీరోగా నటించిన చిత్రం ‘సామాట్ర్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj). రూ. 200కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. మిస్ యూనివర్స్-2017 విజేత మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్‌గా నటించింది. చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించాడు. యశ్‌రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) నిర్మించింది. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ (Prithviraj Chauhan) జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో జూన్ 3న హిందీ, తెలుగు, తమిళ్‌లో విడుదల అయింది. 


‘సామ్రాట్ పృథ్వీరాజ్’ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. సినిమా విడుదలైన 10వరోజు రూ.1.85కోట్ల నుంచి రూ. 2కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 62కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. పూర్తి రన్‌లో దాదాపుగా రూ. 65కోట్ల వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు. ఈ సినిమాతో మేకర్స్‌కు భారీ నష్టాలు తప్పేలా లేవు. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ కు పోటీగా జూన్ 3న మరో రెండు సినిమాలు ‘మేజర్’, ‘విక్రమ్’ విడుదల అయ్యాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ పై ఎవరు ఆసక్తి చూపించలేదు. 



Updated Date - 2022-06-13T22:56:31+05:30 IST