Akshay Kumar: ‘ది కశ్మీర్ ఫైల్స్’ నా సినిమాని దెబ్బకొట్టింది

ABN , First Publish Date - 2022-03-27T16:57:33+05:30 IST

ఇప్పుడు దేశం మొత్తం ‘ది కశ్మీర్ ఫైల్స్’ గురించే మాట్లాడుకుంటుంది. 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన దురాగతాలు..

Akshay Kumar: ‘ది కశ్మీర్ ఫైల్స్’ నా సినిమాని దెబ్బకొట్టింది

ఇప్పుడు దేశం మొత్తం ‘ది కశ్మీర్ ఫైల్స్’  గురించే మాట్లాడుకుంటుంది. 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన దురాగతాలు, వలసల ఆధారంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ చిత్రం అందరి మన్ననలు అందుకుంటోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలైన రెండు వారాల్లో రూ.200 కోట్లకి పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. దీంతో ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా అక్షయ్ కుమార్ ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘బచ్చన్ పాండే’ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూస్‌నే అందుకుంది. అయితే చాలా చోట్ల ఈ మూవీని తీసేసి ‘ది కశ్మీర్ ఫైల్స్’ వేయాలంటూ ప్రేక్షకులు డిమాండ్ చేశారు. దీంతో ఈ సినిమాకి స్క్రీన్స్ తగ్గి, కలెక్షన్లపై ప్రభావం పడింది. 


దీని గురించి అక్షయ్ కుమార్ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో.. ‘ది కశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను కదిలించింది. మంచి సక్సెస్‌ని అందుకుంది. ఇందులో విచిత్రమేంటంటే ఈ సినిమా ఎఫెక్ట్ నా మూవీపై కూడా పడింది. టోటల్ కలెక్షన్లను దెబ్బకొట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ.. ‘ది కశ్మీర్ ఫైల్స్‌‌ని అభినందించినందుకు ధన్యవాదాలు అక్షయ్ కుమార్’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఇంతకుముందు సైతం ఈ సినిమాని, అనుపమ్ ఖేర్‌ని సపోర్టు చేస్తూ ట్వీట్ చేశాడు.



Updated Date - 2022-03-27T16:57:33+05:30 IST