‘ఆకాశ‌వాణి విశాఖప‌ట్టణ కేంద్రం’: పెంచలదాస్ రాసి, పాడిన పాట విడుదల

ABN , First Publish Date - 2022-09-11T07:11:17+05:30 IST

శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా.. మిథున ఎంట‌ర్‌టైన్‌మెట్స్ ప్రై.లి, సైన్స్‌ స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ఆకాశ‌వాణి విశాఖప‌ట్టణ కేంద్రం’. జ‌బ‌ర్దస్త్ ఫేం..

‘ఆకాశ‌వాణి విశాఖప‌ట్టణ కేంద్రం’: పెంచలదాస్ రాసి, పాడిన పాట విడుదల

శివ కుమార్, హుమయ్ చంద్, అక్షత శ్రీధర్, అర్చన హీరోహీరోయిన్లుగా.. మిథున ఎంట‌ర్‌టైన్‌మెట్స్ ప్రై.లి, సైన్స్‌ స్టూడియోస్ ప్రొడ‌క్ష‌న్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘ఆకాశ‌వాణి విశాఖప‌ట్టణ కేంద్రం’. జ‌బ‌ర్దస్త్ ఫేం స‌తీష్ బ‌త్తుల ఈ చిత్రంతో దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఎం.ఎం. అర్జున్‌ నిర్మాత‌. థ్రిల్లింగ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని సెకండ్‌ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకున్న విశిష్టత ఏమిటంటే.. ఈ పాటని పెంచలదాస్ రాయడమే కాకుండా.. ఆయనే స్వయంగా ఆలపించారు. కార్తీక్ కొడ‌కండ్ల సంగీత సారథ్యంలో ఈ పాట రూపుదిద్దుకుంది.


పాట విడుదల సందర్భంగా చిత్ర నిర్మాత ఎం.ఎం.అర్జున్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం యూనివర్సల్ పాయింట్‌తో తెరకెక్కుతోంది. అందుకే పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నాం. దర్శకుడు సతీష్‌ క‌థ చెప్పగానే బాగా న‌చ్చింది. ఆయ‌న సినిమాను నెరేట్ చేసిన దాని కంటే చ‌క్కగా తెర‌కెక్కిస్తున్నారు. ఓ మంచి సినిమాను రూపొందించ‌డంలో నిర్మాత‌గా నా వంతు బాధ్యత‌ను స‌మ‌ర్ధవంతంగా నిర్వర్తించాను. కార్తీక్ కొడ‌కండ్ల సంగీతం అందించిన పాటల్లో ఇప్పటికే ఓ పాటను విడుదల చేశాం. చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు సెకెండ్ లిరికల్ సాంగ్ విడుద‌ల చేశాం. ఈ సాంగ్‌ని ప్రముఖ గాయకుడు, రచయిత పెంచలదాస్ రాసి... ఆలపించారు. గతంలో ఆయన పాడిన అరవింద సమేత, కృష్ణార్జున యుద్ధం చిత్రాల సాంగ్స్‌కి ఎంత మంచి పేరు వచ్చిందో... ఈ సాంగ్‌కి అంతే స్థాయిలో పేరు రావడం ఖాయం. త్వ‌ర‌లోనే ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అని తెలపగా, దర్శకుడు సతీష్ బత్తుల మాట్లాడుతూ.. ఆకాశ‌వాణి విశాఖ‌ప‌ట్టణ కేంద్రం.. ఈ చిత్రం డిఫ‌రెంట్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. నిర్మాత మ‌ల్లికార్జున్‌గారి స‌పోర్ట్ లేక‌పోతే ఇంత దూరం రాగ‌లిగే వాళ్లం కాదు. మేకింగ్‌లో మ‌ల్లికార్జున్‌ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. పాన్ ఇండియా మూవీగా సినిమా రిలీజ్‌కి సన్నద్ధమవుతుంది. ప్రతి ఒక్కరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు.. అని తెలిపారు.

Updated Date - 2022-09-11T07:11:17+05:30 IST