భూమికి 35వేల అడుగుల ఎత్తులో నిజం ఉందంటున్న అజయ్ దేవగణ్

ABN , First Publish Date - 2022-03-22T00:38:03+05:30 IST

బాలీవుడ్ అగ్ర కథానాయకులు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్

భూమికి 35వేల అడుగుల ఎత్తులో నిజం ఉందంటున్న అజయ్ దేవగణ్

బాలీవుడ్ అగ్ర కథానాయకులు అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రన్ వే-34’. రకుల్ ప్రీత్ సింగ్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. అజయ్ దేవగణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. 2015లో జరిగిన ఓ యద్దార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. గతంలో అజయ్ ‘శివాయ్’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దాదాపుగా ఐదేళ్ల అనంతరం అతడి నుంచి డైరెక్టర్‌గా వస్తున్న చిత్రమిదీ. ఈ మూవీ ట్రైలర్‌ను అతడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘‘ప్రతి సెకను లెక్కలోకి వస్తుంది. మేం టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్నాం’’ అని అజయ్ దేవగణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.  


‘‘భూమికి 35వేల అడుగుల ఎత్తులో నిజం ఉంది’’ అనే ట్యాగ్‌లైన్‌‌ను ‘రన్ వే-34’ ట్రైలర్‌లో చూపించారు. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ పైలెట్లుగా నటించారు. విచారణాధికారి పాత్రలో బిగ్ బీ అమితాబ్ కనిపించాడు. రూల్స్‌ను పాటించని పైలెట్‌గా అజయ్ ట్రైలర్‌లో దర్శనమిచ్చాడు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా చిత్రం రూపొందినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీ ‘ఈద్’ సందర్భంగా ఏప్రిల్ 29న విడుదల కానుంది. 



Updated Date - 2022-03-22T00:38:03+05:30 IST