Aishwarya Rai: ఎవరికి దక్కని అదృష్టం నా కూతురికి దక్కింది.. ‘పొన్నియిన్ సెల్వన్’ ఈవెంట్‌లో ఐశ్వర్య వ్యాఖ్యలకి కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-09-25T15:30:30+05:30 IST

దాదాపు 15 ఏళ్ల నుంచి సరైన సినిమాలు చేయకపోయినప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గని బ్యూటీ ఐశ్వర్యారాయ్(Aishwarya Rai)...

Aishwarya Rai: ఎవరికి దక్కని అదృష్టం నా కూతురికి దక్కింది.. ‘పొన్నియిన్ సెల్వన్’ ఈవెంట్‌లో ఐశ్వర్య వ్యాఖ్యలకి కారణమేంటంటే..

దాదాపు 15 ఏళ్ల నుంచి సరైన సినిమాలు చేయకపోయినప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గని బ్యూటీ ఐశ్వర్యారాయ్(Aishwarya Rai). చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ భామ సౌత్‌లో ఈ భామ నటించిన కొత్త చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’(Ponniyin Selvan). కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి వంటి స్టార్లతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రంలో ఎంతో కీలకమైన పాత్రనే యువరాణి నందిని క్యారెక్టర్‌ని చేస్తోంది.


రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అనంతరం విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుని ఆ అంచనాలను ఇంకా పెంచేశాయి. ఈ సిరీస్‌లో మొదటి భాగం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఓ లాంచ్ ఈవెంట్‌‌ని నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.


ఐశ్వర్యా మాట్లాడుతూ.. ‘నా కూతురు ఆరాధ్య (Aaradhya) ఓ సారి ఈ మూవీ సెట్‌కి వచ్చింది. ఆ సెట్‌ని చూసి చాలా ఆశ్చర్యానికి లోనైంది. ఇదే సమయంలో మణిరత్నం సర్ పిలిచి మరి.. ఆరాధ్యకి ఓ సీన్ కోసం కట్ చెప్పేందుకు అవకాశం ఇచ్చాడు. మణిరత్నం సర్ అలా వేరే వారికి సీన్ కట్ చెప్పే అవకాశం ఇవ్వడం మొదటి సారి. అందుకే అందరూ ఆశ్చర్యపోయారు. అది తనకి, తన కూతురికి జీవితాంతం ఓ అద్భుతమైన జ్ఞాపకంగా మిగిపోతుంది’ అని చాలా సంతోషంగా చెప్పుకొచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో ఐశ్యర్య చేయడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు చేసిన మూడు చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈ మూవీ కూడా విజయం సాధిస్తుందని మూవీ టీం మొత్తం నమ్మకంగా ఉంది.

Updated Date - 2022-09-25T15:30:30+05:30 IST