Aishwarya Lekshmi: పసుపు దుస్తులంటే వణికిపోతున్న కుర్ర హీరోయిన్.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-12-08T19:26:50+05:30 IST

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyyin Selvan)లో పూంగుళలిగా, విష్ణు విశాల్‌ నటించిన ‘మట్టీకుస్తీ’ (Matti Kusthi)లో రెబెల్‌ భార్యగా..

Aishwarya Lekshmi: పసుపు దుస్తులంటే వణికిపోతున్న కుర్ర హీరోయిన్.. కారణం ఏంటంటే..

‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyyin Selvan)లో పూంగుళలిగా, విష్ణు విశాల్‌ నటించిన ‘మట్టి కుస్తీ’ (Matti Kusthi)లో రెబెల్‌ భార్యగా నటించి టాలీవుడ్‌ (Tollywood)లోనూ గుర్తింపు పొందిన హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi). ఈ బ్యూటీకి పసుపు దుస్తులంటే బెదిరిపోతోంది. ‘మట్టి కుస్తీ’లో ఆమె పోషించిన మల్లయుద్ధ క్రీడాకారిణి పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.


సాయి పల్లవి (Sai Pallavi) నటించిన ‘గార్గి’ (Gargi) సినిమాకి ఐశ్వర్య లక్ష్మి ఓ నిర్మాతగా వ్యవహరించింది. బాలికలపై వేధింపుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమా గురించి ఐశ్వర్య మాట్లాడుతూ.. తనకు బాల్యంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించింది. ‘ప్రతి మహిళ తమ జీవితంలో ఏదో ఒక చేదు అనుభవం ఎదుర్కొని ఉంటారని నేను నమ్ముతున్నాను. ఇప్పటికి కూడా అలాంటి పరిస్థితే కొనసాగుతుంది. నాకు బాల్యంలోనే గురువాయూరు ఆలయంలో అలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఓ యువకుడు నా పట్ల దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ వయస్సులో ఎలా రియాక్ట్‌ కావాలో తెలియదు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఆ రోజున నేను పసుపు రంగులో స్ట్రాబెరీ డిజైన్‌ చేసిన ఫ్రాక్‌ ధరించి ఉన్నాను. అందుకే పసుపు రంగు డ్రెస్సులు వేసుకోవాలంటే కొంచెం భయంగా అనిపిస్తుంది’ అని ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చింది.





Updated Date - 2022-12-08T19:26:50+05:30 IST