Aishwarya Lekshmi: నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్న హీరోయిన్.. థ్రిల్ చేస్తానంటూ..

ABN , First Publish Date - 2022-10-17T14:26:17+05:30 IST

యువ హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) ఒకవైపు హీరోయిన్‌గా రాణిస్తూనే మరోవైపు చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టింది...

Aishwarya Lekshmi: నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్న హీరోయిన్.. థ్రిల్ చేస్తానంటూ..

యువ హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi) ఒకవైపు హీరోయిన్‌గా రాణిస్తూనే మరోవైపు చిత్ర నిర్మాణంలో అడుగుపెట్టింది. ‘కుమారి(Kumari)’ అనే పేరుతో తమిళ, మలయాళ భాషల్లో నిర్మిస్తోంది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘మణిరత్నం దర్శకత్వం వహించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ (Ponniyin Selvan) చిత్రంలో పూంగుళలి అనే పాత్రలో నటించాను. ఆ పాత్రకు మంచి పేరుతో పాటు ప్రశంసలు కూడా వచ్చాయి. ‘అమ్ము(Ammu)’ అనే తెలుగు చిత్రంలో నటించాను. ఇది ఈ నెల 19న ఓటీటీలో విడుదలకానుంది. ‘కుమారి’ చిత్రం ఈ నెల 28న విడుదలకానుంది.


ఈ భామ మొదట సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించిన ‘గార్గి’ (Gargi) చిత్రానికి నిర్మాతగా వ్యవహారించాను. ప్రస్తుతం ‘కుమారి’ చిత్రాన్ని నిర్మించాను. ఇందులో కూడా కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించాను. ఇది ఒక పురాణ ఇతిహాస జోనర్‌లో రూపొందిన థ్రిల్లర్‌ మూవీ. ఆ సినిమా చూసి అందరూ కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు’ అని వెల్లడించింది. అయితే.. సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమాతో ఐశ్వర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘పొన్నియిన్ సెల్వన్’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం ‘అర్చన 31 నాట్ ఔట్’, ‘గుట్ట కుష్తీ’ వంటి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Updated Date - 2022-10-17T14:26:17+05:30 IST