ఆహాలో ‘పరిణయం’.. ఎప్పుడంటే?
ABN , First Publish Date - 2021-09-19T00:53:55+05:30 IST
మలయాళ సూపర్స్టార్ దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా పాపులర్ ఫిల్మ్ మేకర్ సత్యన్ అంతిఖడ్ తనయుడు అనూప్ సత్యన్ రూపొందించిన మలయాళ చిత్రం ‘వరణే అవశ్యముంద్’. సురేశ్ గోపి, శోభన కీలక పాత్రల్లో నటించిన
మలయాళ సూపర్స్టార్ దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా పాపులర్ ఫిల్మ్ మేకర్ సత్యన్ అంతిఖడ్ తనయుడు అనూప్ సత్యన్ రూపొందించిన మలయాళ చిత్రం ‘వరణే అవశ్యముంద్’. సురేశ్ గోపి, శోభన కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మలయాళంలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుని బ్లాక్బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడీ చిత్రాన్ని ‘పరిణయం’ అనే టైటిల్తో తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది 100 పర్సంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రీమియర్ కాబోతోందని ఆహా అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. ఓ ఫ్రెంచ్ ట్యూటర్, కుమార్తె నికితాతో జీవితం వెళ్లదీసే సింగిల్ పేరెంట్ నీనా మధ్య నడిచే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. నికితాకు సరైన వరుడిని వెతకడంలో నీనా బిజీగా ఉన్న సమయాన, ఆమెకు తన పక్కింటిలో ఉండే మేజర్ ఉన్ని కృష్ణన్తో అనుబంధం ఏర్పడుతుంది. మనసులో నికితా ప్రాథమికంగా ఎంతో ఘర్షణ పడుతుంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో స్నేహం చేస్తుంది. అయితే అతనొక ఫ్రాడ్. మరి నీనా పెళ్లి విషయంలో మరో నిర్ణయం తీసుకుంటుందా? మరి కుమార్తె నికితా నుంచి ఆమె పెళ్లికి అంగీకారం దొరుకుతుందా? అనేదే సినిమా. ఎమోషన్స్, హ్యుమర్, రొమాన్స్ అంశాల కలయికగా చక్కటి హాస్యంతో మానవ సంబంధాలపై అభిప్రాయాన్ని తెలియజేసే చిత్రమిదని ఆహా పేర్కొంది.