Mahesh Babu: మళ్ళీ ఫారిన్ ట్రిప్.. SSMB28పై డౌట్స్!

ABN , First Publish Date - 2022-07-24T04:00:15+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా తర్వాత.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ (Trivikram Srinivas)తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సెట్స్‌పైకి

Mahesh Babu: మళ్ళీ ఫారిన్ ట్రిప్.. SSMB28పై డౌట్స్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమా తర్వాత.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ (Trivikram Srinivas)తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లాల్సింది. స్క్రిప్ట్‌లో మార్పుల కారణంగా ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూనే ఉంది. మాటల మాంత్రికుడు కథలో మార్పులు చేర్పులు చేస్తుంటే.. మహేశ్ మాత్రం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఫారిన్ నుంచి మహేశ్ రావడంతో SSMB28 వర్క్స్ స్టార్ట్ అయిపోతాయి అని అందరూ డిసైడ్ అయిపోయారు కానీ అవ్వలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? అనే డౌట్ వచ్చే టైంకి, మేకర్స్ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చింది. SSMB28 ప్రాజెక్ట్ ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్తుందని రివీల్ చేశారు. సెట్స్ పైకి వెళ్లడానికి టైం ఉందనో.. లేక లుక్ కోసం ప్రిపేర్ అవ్వడానికో తెలియదు కానీ మహేశ్ బాబు మళ్ళీ ఫారిన్ ట్రిప్‌కి వెళ్లిపోయాడు. 


మహేశ్ ఫారిన్ టూర్ వెళ్లడం కొత్తేమీ కాదు కానీ, ఇలా ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళాల్సిన టైమ్‌లో, మహేశ్ ట్రిప్‌కి వెళ్లడం ఇదే మొదటిసారి. SSMB28 ఇంకా డిలే అవుతుందా లేక ఇంకేదైనా కారణం చేత మహేశ్ బ్యాక్ టు బ్యాక్ ట్రిప్స్ వేస్తున్నాడా అనేది తెలియదు కానీ... మహేశ్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ త్వరగా సెట్స్ పైకి వెళ్తే చాలని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దీన్ని కాస్త కన్సిడర్ చేసి, మేకర్స్ SSMB28 షూటింగ్‌ని స్టార్ట్ చేస్తే... ఈ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి మహేశ్.. రాజమౌళి (Rajamouli)తో చేయనున్న పాన్ ఇండియా సినిమాకి ప్రిపేర్ అవ్వడానికి, రెడీ అవ్వడానికి సరిపడా టైం ఉంటుందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Updated Date - 2022-07-24T04:00:15+05:30 IST