నిన్ను వదలా?.. బండ్ల గణేష్కు మూడోసారి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-10T02:00:36+05:30 IST
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఆయన ఇప్పటికే రెండు సార్లు కరోనా బారిన పడి, కోలుకున్నారు. రెండో సారి పరిస్థితి కాస్త ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. నిన్ను వదలా? అన్నట్లుగా ఆయనని
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఆయన ఇప్పటికే రెండు సార్లు కరోనా బారిన పడి, కోలుకున్నారు. రెండో సారి పరిస్థితి కాస్త ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. నిన్ను వదలా? అన్నట్లుగా ఆయనని మరోసారి కరోనా వెంబడించింది. తాజాగా ఆయన కరోనా బారిన పడినట్లుగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.
‘‘గత మూడు రోజులు నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు(ఆదివారం) సాయంత్రం పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. నాకు స్వల్ప లక్షణాలే ఉన్నాయి. నా ఫ్యామిలీ మెంబర్స్కి నెగిటివ్ వచ్చింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేయాలనుకునేవారు ఒకసారి ఆలోచించుకోండి. ప్రస్తుతం నేను ఐసోలేషన్లో ఉన్నాను. ధన్యవాదాలు.. క్షేమంగా ఉండండి..’’ అని బండ్ల గణేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే టాలీవుడ్కి చెందిన పలువురు సెలబ్రిటీలు కరోనా పాజిటివ్తో హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.