పెళ్లి తర్వాత సందీప్ రెడ్డి వంగ సినిమా షూటింగ్ ప్రారంభించిన రణ్బీర్ కపూర్
ABN , First Publish Date - 2022-04-22T22:52:16+05:30 IST
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ను, రణ్బీర్ కపూర్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన కొన్ని రోజులకే ఆలియా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా షూటింగ్ను మొదలుపెట్టింది.
బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ను, రణ్బీర్ కపూర్ ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన కొన్ని రోజులకే ఆలియా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా షూటింగ్ను మొదలుపెట్టింది. తాజాగా ఆమె భర్త రణ్బీర్ కపూర్ కూడా ‘యానిమల్’ చిత్రీకరణను మొదలుపెట్టాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘యానిమల్’ చిత్రీకరణ మనాలీలో ఏప్రిల్ 22న ప్రారంభమైంది.
‘యానిమల్’ వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రష్మిక ఈ మూవీలో గీతాంజలి అనే పాత్రలో కనిపించనుంది. ‘యానిమల్’ లో హీరోయిన్గా మొదటగా పరిణీతి చోప్రాను ఎంపిక చేశారు. కానీ, ఆమెకు మరొక అవకాశం రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది. అనంతరం ఆమె ప్లేస్లోకి రష్మికను తీసుకున్నారు.