భారత్‌కు వచ్చిన విల్‌స్మిత్.. అతడిని కలిసేందుకే అంటూ ఊహాగానాలు..

ABN , First Publish Date - 2022-04-24T22:18:29+05:30 IST

ఆస్కార్ వేడుకల్లో హోస్ట్‌ క్రిస్‌రాక్‌ని చెంప దెబ్బకొట్టి వివాదస్పదం అయిన హాలీవుడ్ నటుడు విల్ స్మిత్. ఈ సంఘటన తర్వాత అతడిపై మోషన్ పిక్చర్

భారత్‌కు వచ్చిన విల్‌స్మిత్.. అతడిని కలిసేందుకే అంటూ ఊహాగానాలు..

ఆస్కార్ వేడుకల్లో హోస్ట్‌ క్రిస్‌రాక్‌ని చెంప దెబ్బకొట్టి వివాదస్పదం అయిన హాలీవుడ్ నటుడు విల్ స్మిత్. ఈ సంఘటన తర్వాత అతడిపై మోషన్ పిక్చర్ అకాడమీ పదేళ్లు నిషేధం విధించింది. అనంతరం అతడు కెమెరాలకు ఎక్కడ కనిపించలేదు. తాజాగా విల్‌ స్మిత్‌ తొలిసారి బయటకు వచ్చాడు. ఇండియా బాట పట్టాడు. ముంబైలోని ప్రైవేట్ ఎయిర్ పోర్టులో ఏప్రిల్ 23న దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కానీ, అతడు భారత్‌కు రావడానికి గత కారణం తెలియడం లేదు.  

 

ఈశా పౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ని కలిసేందుకే విల్ స్మిత్ ఇండియాకు వచ్చినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చెంప దెబ్బ ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో విల్‌స్మిత్ బాధపడ్డాడట. అందువల్లే సద్గురు వద్ద కొంత సమయం గడపాలని వచ్చినట్టు సమాచారం. విల్ స్మిత్ 2019లో కూడా భారతదేశాన్ని సందర్శించాడు. అప్పట్లో అనేక మంది బాలీవుడ్ నటులు అతడిని కలుసుకున్నారు. ఆ సమయంలోనే పునీత్ మల్హోత్రా తెరకెక్కించిన ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్-2’ లో అతిథి పాత్రలో కనిపించాడు. ఈ సారి బీటౌన్ సెలబ్రిటీలను కలుస్తాడా, లేదా అనేది తెలియాలంటే మాత్రం కొన్నిరోజులు ఆగాల్సిందే. 



Updated Date - 2022-04-24T22:18:29+05:30 IST