విడాకుల ప్రకటన తర్వాత తన కొడుకులతో కలసి తొలిసారి బయటికొచ్చిన ధనుష్

ABN , First Publish Date - 2022-03-19T21:11:07+05:30 IST

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విడాకులు

విడాకుల ప్రకటన తర్వాత తన కొడుకులతో కలసి తొలిసారి బయటికొచ్చిన ధనుష్

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్టు ఈ ఏడాది జనవరి 17న ప్రకటించిన సంగతి తెలిసిందే. 18ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు వీరిద్దరూ సోషల్ మీడియాలో వేర్వేరుగా వెల్లడించారు. ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించగానే స్టార్ హీరో అభిమానులందరూ షాక్‌కు గురి అయ్యారు. అనంతరం వీరిద్దరూ తమ సినిమా పనుల్లో బిజీ అయిపోయారు.


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు ఐశ్వర్యతో 2004 నవంబర్ 18న వివాహం జరిగింది. వీరికి యాత్రా, లింగ అనే ఇద్దరూ పిల్లలు ఉన్నారు. విడాకుల ప్రకటన అనంతరం ధనుష్ తన పిల్లలతో కలసి తొలిసారి బయటికొచ్చాడు. తన కొడుకులతో కలసి ఇళయరాజా కన్సర్ట్‌కు హాజరయ్యాడు. ఈ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ధనుష్ ఈ కన్సర్ట్‌లో ఇళయరాజా పాటను కూడా రీ క్రియేట్ చేశాడు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కూడా ఈ ఈవెంట్‌‌లో సందడి చేశాడు. కొన్ని రోజుల క్రితం తమ వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్టు ఐశ్వర్య, ధనుష్ ఇన్‌స్టాగ్రామ్‌లో విడివిడిగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘18ఏళ్ల పాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా మా ప్రయాణాన్ని కొనసాగించాం. ప్రస్తుతం మేం వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. వ్యక్తిగతంగా సమాయాన్ని వెచ్చించాలనుకుంటున్నాం. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి’’ అని ధనుష్ అప్పట్లో ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.






Updated Date - 2022-03-19T21:11:07+05:30 IST