Puneeth Rajkumar నటించిన సినిమాల్లోని పాటలు పాడటంతో అప్పట్లో తిట్టిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారంటున్న పాకిస్థానీ సింగర్

ABN , First Publish Date - 2021-11-04T20:49:04+05:30 IST

పునీత్ రాజ్‌కుమార్ ఈ మధ్యనే గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించారు. జిమ్ చేస్తుండగా కార్డియాక్ అరెస్టుకు గురయ్యి విక్రమ్ ఆసుపత్రిలో ఆయన మృతి చెందారు.

Puneeth Rajkumar నటించిన సినిమాల్లోని  పాటలు పాడటంతో అప్పట్లో తిట్టిన వారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారంటున్న పాకిస్థానీ సింగర్

పునీత్ రాజ్‌కుమార్ ఈ మధ్యనే గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించారు. జిమ్ చేస్తుండగా కార్డియాక్ అరెస్టుకు గురయ్యి విక్రమ్ ఆసుపత్రిలో ఆయన మృతి చెందారు. కన్నడ కంఠీరవ పునీత్ మరణించిన అనంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పునీత్ పాటలు పాడటంతో పాకిస్థాన్‌కు చెందిన ఒక సింగర్‌ని అప్పట్లో  నెటిజన్లు తిట్టేవారు. ప్రస్తుతం అతడు పాడిన పాటలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో అతడిని నెటిజన్లు మెచ్చుకోవడం ప్రారంభించారు. 


అజ్మల్ మొఘల్ అనే వ్యక్తి పాకిస్థాన్‌లోని లాహోర్‌లో నివసిస్తున్నాడు. పునీత్ రాజ్ కుమార్ నటించిన సినిమాల్లోని పాటలు పాడి దశాబ్దాకాలంగా అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. పునీత్ మరణానంతరం అజ్మల్ మొఘల్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాడు. గతంలో అప్పు నటించిన సినిమాల్లోని పాటలు పాడినప్పుడు తన కామెంట్ బాక్స్‌లో అందరూ తిట్టేవారని చెబుతున్నాడు. ఆ స్టార్ హీరో మరణంతో తన పాటలు వెలుగులోకి వచ్చి ప్రస్తుతం అందరూ మెచ్చుకుంటున్నారని వివరిస్తున్నాడు. 


అజ్మల్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ పునీత్ రాజ్ కుమార్ మంచి నటుడు మాత్రమే కాదు. మంచి మనిషి అని నేను విన్నాను. కళలకు సరిహద్దులు లేవు. ప్రపంచంలోని కన్నడిగలందరూ అతడి మృతికి నివాళులు అర్పిస్తున్నారు. నేను 2012 నుంచి సోషల్ మీడియాలో పాటలను అప్‌లోడ్ చేస్తున్నాను. అప్పట్లో అందరూ నన్ను తిట్టేవారు. పునీత్ మరణానంతరం నేను పాడిన పాటలు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారాయి. ప్రస్తుతం అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. సోనూ నిగమ్‌కీ నేను వీరాభిమానిని. అతడికి ఫిల్మ్ ఫేర్ వచ్చిందని తెలియగానే నేను ఎంతో సంతోషించాను  ’’ అని అతడు వెల్లడించాడు.



Updated Date - 2021-11-04T20:49:04+05:30 IST