విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిన ధనుష్, ఐశ్వర్య

ABN , First Publish Date - 2022-01-25T00:55:17+05:30 IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజినీకాంత్ కూతురు ఐశ్వర్య కొన్ని రోజుల క్రితం విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే

విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిన ధనుష్, ఐశ్వర్య

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజినీకాంత్ కూతురు ఐశ్వర్య కొన్ని రోజుల క్రితం విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 18ఏళ్ల దాంపత్య జీవితం అనంతరం తాము విడిపోతున్నట్టు సోషల్ మీడియాలో వీరిద్దరు వేర్వేరుగా వెల్లడించారు.


ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్య తమ పనుల్లో బిజీ అయినట్టు తెలుస్తోంది. ఐశ్వర్యకు సంబంధించిన ఒక ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తాను డైరెక్షన్ చేయబోయే సినిమాకి సంబంధించిన పనుల్లో ఐశ్వర్య ఉంది. సినిమాలోని పాటకు సంబంధించిన పనులు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ధనుష్ ‘‘సార్’’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.


ధనుష్, ఐశ్వర్య విడిపోవడంతో వారి విడాకులపై ధనుష్ తండ్రి కస్తూరి రాజా మీడియాతో మాట్లాడాడు. ‘‘ త్వరలోనే వారిద్దరు కలిసిపోయే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సాధారణం. అటువంటి గొడవలే వీరిద్దరి మధ్య చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో లేరు. హైదరాబాద్‌లో ఉన్నారు. ఫోన్‌లో వారితో మాట్లాడాను. కొన్ని సలహాలు, సూచనలు అందించాను ’’ అని ధనుష్ తండ్రి కస్తూరి రాజా అన్నాడు. కాగా.. ధనుష్, ఐశర్య హైదరాబాద్‌లోని ఒకే హోటల్‌లో ఉంటున్నట్టు కొద్ది రోజుల క్రితం పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి.



Updated Date - 2022-01-25T00:55:17+05:30 IST