Major: ‘మేజర్‌’ టీమ్‌కు యోగి ప్రశంసలు!

ABN , First Publish Date - 2022-06-21T19:17:56+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ‘మేజర్‌’ టీమ్‌ను సత్కరించారు. చిత్ర కథానాయకుడు అడివి శేష్‌, సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ తల్లిదండ్రులు మంగళవారం యోగి ఆదిత్యానాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా యోగి చిత్ర బృందాన్ని అభినందించారు. అడివి శేష్‌తోపాటు సందీప్‌ తల్లిదండ్రులను శాలువతో సత్కరించి, వెండి కాయిన్‌ బహకరించారు.

Major: ‘మేజర్‌’ టీమ్‌కు యోగి ప్రశంసలు!

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ‘మేజర్‌’ (Major)టీమ్‌ను సత్కరించారు. చిత్ర కథానాయకుడు అడివి శేష్‌(Adivi sesh), సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ తల్లిదండ్రులు మంగళవారం యోగి ఆదిత్యానాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా యోగి చిత్ర బృందాన్ని అభినందించారు. అడివి శేష్‌తోపాటు సందీప్‌ తల్లిదండ్రులను శాలువతో సత్కరించి, వెండి కాయిన్‌ బహకరించారు. ఈ విషయాన్ని అడివి శేష్‌ ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. ‘‘నేను, సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ తల్లిదండ్రులు, నా టీమ్‌తో కలిసి యోగి ఆదిత్యానాథ్‌గారిని కలిశాం. ‘మేజర్‌’ చిత్రం గురించి ఆయన చెప్పిన మాటలు విని చాలా సంతోషించాం. మమ్మల్ని శాలువతో సత్కరించి, ఒక వెండి కాయిన్‌ను బహుకరించడం చాలా గర్వంగా అనిపించింది. ఇదొక గొప్ప గౌరవంగా భావిస్తున్నా’’ అని శేష్‌ రాసుకొచ్చారు. (Adivi Sesh meets CM Yogi Adityanath)


శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్‌, సయీ మంజ్రేకర్‌ జంటగా నటించిన ‘మేజర్‌’ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై సక్సెస్‌ సాధించింది. ఊహించిన దాని కన్నా అధిక వసూళ్లు రాబట్టడమే కాకుండా గౌరవ మర్యాదలు కూడా తెచ్చిపెట్టిందీ చిత్రం. 



Updated Date - 2022-06-21T19:17:56+05:30 IST