Adivi Sesh: రెండు రోజులు షూటింగ్‌ చేసి నన్ను తీసేశారు..

ABN , First Publish Date - 2022-05-13T18:14:53+05:30 IST

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అడివి శేష్ (Adivi Sesh). తాజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ సూపర్ హిట్ సినిమా నుంచి తనని తీసేశారని చెప్పాడు.

Adivi Sesh: రెండు రోజులు షూటింగ్‌ చేసి నన్ను తీసేశారు..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అడివి శేష్ (Adivi Sesh). తాజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ సూపర్ హిట్ సినిమా నుంచి తనని తీసేశారని చెప్పాడు. దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శేష్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం మేజర్ (Major). మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ (Major Sandeep Unni Krishanan) బయోపిక్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గూఢాచారి (Goodachari) ఫేమ్ శశి కిరణ్ తిక్కా (Sasikiran Tikka) దర్శకత్వంలో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మిస్తున్నాయి.


ఈ సినిమాను జూన్‌ 3న తెలుగుతో పాటుగా హిందీ, మలయాళ భాషలలో రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్ కాగా.. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇదే క్రమంలో ఓ ఇంటర్వ్యూలోనూ పాల్గొన్న అడవి శేష్ మేజర్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు తన కెరీర్‌లో చేతివరకు వచ్చి మిస్సయిన సినిమాల గురించి చెప్పాడు. వాటిలో భారీ హిట్ సాధించిన చందమామ మూవీ ఉండటం ఆసక్తికరం.


కృష్ణవంశీ దర్శకత్వంలో నవదీప్, శివ బాలాజీ, కాజల్ అగర్వాల్, సింధూ మీనన్ హీరోహీరోయిన్స్‌గా నటించగా.. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి హిట్ సాధించింది చందమామ. అయితే, ఇందులో ముందు నవదీప్ కాకుండా శేష్‌ను తీసుకున్నారట. రెండు రోజులు షూటింగ్ కూడా చేశాక తొలగించారని చెప్పుకొచ్చాడు. అలాగే, శ్రీనువైట్ల దర్శకత్వంలో ఆర్యన్ రాజేష్, నమిత హీరోహీరోయిన్స్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన సొంతం సినిమాలో కూడా పెద్ద రోల్ అని చెప్పి ఫైనల్‌గా 5 సెకన్లు మాత్రమే ఉన్న రోల్ ఇచ్చారని చెప్పాడు. మరి ఎందుకు ఇలా జరిగిందో తెలీదు గానీ, ఇప్పుడు అడివి శేష్ మాటలు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Updated Date - 2022-05-13T18:14:53+05:30 IST