కరోనా ఎఫెక్ట్: ఆ క్రేజీ ఫిల్మ్ కూడా వాయిదా!
ABN , First Publish Date - 2022-01-24T22:23:56+05:30 IST
ఇప్పుడున్న కరోనా పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా తాజాగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దేశంలో పలు చోట్ల కర్ఫ్యూలు, కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో చిత్రాన్ని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయడం లేదని
యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటిస్తోన్న క్రేజీ ఫిల్మ్ ‘మేజర్’. అతడి మొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవల అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పుడున్న కరోనా పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా తాజాగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దేశంలో పలు చోట్ల కర్ఫ్యూలు, కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో చిత్రాన్ని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయడం లేదని మేకర్లు ప్రకటించారు. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలైన ‘రాధేశ్యామ్’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడా జాబితాలోకి ఈ చిత్రం కూడా చేరింది.
‘‘దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. కొన్ని చోట్ల కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల కరోనా ఆంక్షలు ఉన్న నేపథ్యంలో సినిమాను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే మరో విడుదల తేదీని ప్రకటిస్తాం. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ.. క్షేమంగా ఉండండి. మనలో ప్రతీ ఒక్కరూ క్షేమంగా ఉంటేనే దేశం కూడా సురక్షితంగా ఉంటుంది’’ అని ‘మేజర్’ మూవీ మేకర్స్ అధికారికంగా ఓ ప్రెస్నోట్ను విడుదల చేశారు. కాగా, మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకుడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.