Adivi Sesh: నిర్మాత నష్టం భర్తీ చేస్తానంటున్న హీరో..!
ABN , First Publish Date - 2022-11-30T21:46:30+05:30 IST
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి అండదండలు లేకుండా స్వ శక్తితో ఎదిగిన హీరో అడివి శేష్ (Adivi Sesh). ‘క్షణం’, ‘ఎవరు’, ‘మేజర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరిచాడు.
సినీ ఇండస్ట్రీలో ఎటువంటి అండదండలు లేకుండా స్వ శక్తితో ఎదిగిన హీరో అడివి శేష్ (Adivi Sesh). ‘క్షణం’, ‘ఎవరు’, ‘మేజర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరిచాడు. అడివి శేష్ సినిమాలతో ఇప్పటి వరకు ఏ నిర్మాతకు కూడా నష్టం రాలేదు. కానీ, అతడు నటిస్తున్న ఓ చిత్రం అర్ధాంతరంగా ఆగిపోయింది. కొన్ని రోజుల షూటింగ్ చేశాక అటకెక్కింది. ఫలితంగా ప్రొడ్యూసర్కు నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని భర్తీ చేస్తానని అడివి శేష్ గతంలో మాటిచ్చాడట. తాజాగా శేష్ మీడియాకు ఇంటర్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలోనే ఈ విషయాన్ని చెప్పాడు.
అడివి శేష్, శివానీ రాజశేఖర్ హీరో, హీరోయిన్గా ‘టూ స్టేట్స్’ తెలుగు రీమేక్ను 2019లో పట్టాలెక్కించారు. ఈ సినిమాకు డెబ్యూటెంట్ వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించాలి. ఎమ్ఏల్వీ సత్య నారాయణ నిర్మించాలి. కానీ, ఈ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆగిపోయింది. అందుకు గల కారణాలను శేష్ మీడియాకు వివరించాడు. ‘‘డెరెక్టర్ వెంకట్ రెడ్డికి సెట్స్లో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియదు. అందరి మీద అరిచేవాడు. అప్పుడు నిర్మాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. డైరెక్టర్, నిర్మాతకు మధ్య మనస్పర్థాలు తలెత్తాయి. అందువల్ల మేం సినిమాను అటకెక్కించాం. నేను నిర్మాతతో మాట్లాడాను. భవిష్యత్తులో నేను చేయబోయే ‘గుఢచారి 2’ నుంచి షేర్ ఇచ్చి నష్టాన్ని భర్తీ చేస్తానని చెప్పాను’’ అని అడివి శేష్ మీడియాకు తెలిపాడు. తమ కుమార్తె హీరోయిన్గా చేస్తుండటంతో హీరో రాజశేఖర్, జీవిత.. నిర్మాత నుంచి‘టూ స్టేట్స్’ రైట్స్ కొనేందుకు ప్రయత్నించారు. కానీ, దర్శకుడు వెంకట్ రెడ్డి కోర్టు మెట్లెక్కి ఆ డీల్ను అడ్డుకున్నాడు. ఆ సమయంలో వెంకట్ రెడ్డి ఓ ప్రకటనను కూడా విడుదల చేశాడు. ‘‘ఈ సినిమాకు నేను దర్శకుడిని మాత్రమే కాదు. నిర్మాణంలోను భాగస్వామిని. మూవీ రైట్స్, డైరెక్షన్ రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. ఎవరైనా డైరెక్టర్ మిగిలిన 30శాతం షూటింగ్ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే చట్ట ప్రకారం వారు శిక్షకు గురవుతారు’’ అని వెంకట్ రెడ్డి పేర్కొన్నాడు.