Adipurush: ఆ రోజున అయోధ్యలో టీజర్ లాంచ్..!

ABN , First Publish Date - 2022-09-25T21:56:13+05:30 IST

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ (Prabhas) అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. దీంతో అతడు నటిస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియాగా తెరకెక్కుతున్నాయి.

Adipurush: ఆ రోజున అయోధ్యలో టీజర్ లాంచ్..!

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ (Prabhas) అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. దీంతో అతడు నటిస్తున్న సినిమాలన్ని పాన్ ఇండియాగా తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం అతడి చేతిలో ‘ఆది పురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్- కె’ వంటి చిత్రాలున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో భారీ బజ్ ‘ఆది‌పురుష్’ (Adipurush) పై ఉంది.  రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతుంది. ఓం రౌత్ (Om Raut) దర్శత్వం వహిస్తున్నాడు. కృతి సనన్ (Kriti Sanon), సైఫ్‌అలీ ఖాన్ (Saif Ali Khan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ప్రపంచవ్యా‌ప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, చిత్ర బృందం మాత్రం ఇప్పటి వరకు కూడా ‘ఆదిపురుష్’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదు. అభిమానులందరూ అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెర పడినట్టే కనిపిస్తుంది. 


‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రారంభం కానున్నాయని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది. ‘ఆదిపురుష్’ టీజర్‌ను అక్టోబర్ 2న విడుదల చేయనున్నారని తెలుస్తోంది. రాముని జన్మస్థలం అయోధ్యలో టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారని సమాచారం. టీజర్ లాంచ్‌తోనే మేకర్స్  ప్రమోషన్స్‌ను మొదలుపెట్టనున్నారని బీ టౌన్ మీడియా తెలుపుతోంది. ఓం రౌత్ గతంలో ‘తాన్హాజీ’ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ అబ్బుర పరిచేలా ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అందువల్ల ఓం రౌత్, ప్రభాస్ కాంబినేషన్‌పై భారీ బజ్ ఉంది. అయితే, ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఈ మైదానంలో అక్టోబర్ 5న జరిగే రావణ దహన కార్యక్రమంలో కూడా ప్రభాస్‌ పాల్గోనే అవకాశం ఉంది. ‘ఆదిపురుష్’ ను భూషణ్ కుమార్ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ మూవీలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. 

Updated Date - 2022-09-25T21:56:13+05:30 IST