ఎక్కుపెట్టిన రామబాణం

ABN , First Publish Date - 2022-10-01T05:30:00+05:30 IST

రామాయణ ఇతిహాసం నేపథ్యంగా ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్‌’.

ఎక్కుపెట్టిన రామబాణం

రామాయణ ఇతిహాసం నేపథ్యంగా ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ రూపొందిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆదిపురుష్‌’. కృతి సనన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌, సన్నీ సింగ్‌ ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్‌తో టీ సిరీస్‌, రెట్రో ఫైల్స్‌ సంస్థలు ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రనిర్మాణంలో యూవీ క్రియేషన్స్‌ అధినేతలు వంశీ, ప్రమోద్‌ కూడా భాగస్వాములు. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. గురువారం ఉదయం ఈ మూవీ నుంచి ప్రభాస్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. బాణాన్ని ఆకాశం వైపు ఎక్కు పెట్టినట్లు ఈ పోస్టర్‌లో ఉంది. చెడుపై మంచి విజయం సాధించేందుకు శ్రీరాముడి పాత్రలో ప్రభాస్‌ ఎలాంటి ధర్మ పోరాటం చేశారనేది ఈ చిత్రంలో మెయిన్‌ పాయింట్‌. శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు ‘ఆదిపురుష్‌’ టీజర్‌ విడుదల చేయనున్నారు. ఐ మ్యాక్స్‌ ఫార్మెట్‌తో పాటు త్రీ డీలో కూడా ‘ఆదిపురుష్‌’ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నారు. 

Updated Date - 2022-10-01T05:30:00+05:30 IST