Adipurush Teaser: ట్రోల్స్పై స్పందించిన దర్శకుడు
ABN , First Publish Date - 2022-10-05T20:06:06+05:30 IST
Adipurush Teaser: ట్రోల్స్పై స్పందించిన దర్శకుడు గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush). ఓం రౌత్ (Om Raut) దర్శత్వం వహించాడు.
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush). ఓం రౌత్ (Om Raut) దర్శత్వం వహించాడు. కృతి సనన్ (Kriti Sanon)హీరోయిన్గా నటించింది. సైఫ్అలీ ఖాన్ (Saif Ali Khan) కీలక పాత్రను పోషించాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా అయోధ్యలో టీజర్ను రిలీజ్ చేశారు. టీజర్లోని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దీంతో నెటిజన్స్ ఆదిపురుష్ సినిమాను ట్రోల్ చేస్తూ పోస్ట్లు పెట్టారు. విజువల్ ఎఫెక్ట్స్ కార్టూన్లా ఉన్నాయంటూ మండిపడ్డారు. ఈ ట్రోల్స్పై దర్శకుడు ఓం రౌత్ స్పందించాడు.
‘ఆదిపురుష్’ ను థియేటర్స్ కోసం నిర్మించామని, మొబైల్ ఫోన్స్ కోసం కాదని ఓం రౌత్ తెలిపాడు. ‘‘ఆదిపురుష్ టీజర్కు వచ్చిన ప్రేక్షకుల స్పందన చూసి నేను బాధపడ్డాను. కానీ, అదే సమయంలో నేను ట్రోల్స్ చూసి సర్ప్రైజ్ కాలేదు. ఈ సినిమాను థియేటర్స్ కోసం నిర్మించాం. సినిమా హాల్స్లో వెండితెర పరిమాణాన్ని తగ్గించొచ్చు. కానీ, ఆ పరిమాణాన్ని మొబైల్ స్క్రీన్ కోసం తగ్గించకూడదు. నాకు కనుక అవకాశం వస్తే యూట్యూబ్లో టీజర్ను ఎప్పటికి రిలీజ్ చేయను. కానీ, ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావాలనే ఉద్దేశ్యంతో టీజర్ను యూట్యూబ్లో విడుదల చేశాం’’ అని ఓం రౌత్ తెలిపాడు. ఈ సినిమాను రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. రూ.500కోట్ల బడ్జెట్తో రూపొందించారు. చెడుపై, మంచి సాధించిన విజయానికి ప్రతీకగా మూవీని నిర్మించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లంకేశ్గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 3డీ, ఐ మ్యాక్స్ 3డీలోను విడుదల చేయనున్నారు.